వారిని విమానాల్లోకి నిరాకరిస్తే కాంపన్షేషన్ చెల్లించాల్సిందే
- April 12, 2019
రియాద్:ప్రత్యేకావసరాలు గల వ్యక్తులకు టిక్కెట్ ఇచ్చి, విమానాల్లో ప్రవేశానికి నిరాకరిస్తే ఖచ్చితంగా కాంపెన్సేషన్ చెల్లించాల్సిందేనని జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ స్పష్టం చేసింది. టిక్కెట్ బుక్ చేసుకునే సమయంలోనే అన్ని అంశాల్నీ ఎయిర్లైన్స్ సంస్థలు పరిగణనలోకి తీసుకోవాలనీ, టిక్కెట్ మంజూరు చేశాక అభ్యంతరాలు వ్యక్తం చేయడం తగదని జిఎసిఎ స్పష్టం చేసింది. ఒకవేళ టిక్కెట్ ఇచ్చి, ప్రయాణానికి నిరాకరిస్తే ప్రత్యేకావసరాలు గల వ్యక్తులకు టిక్కెట్ ధరపై 200 శాతం అదనంగా తిరిగి చెల్లించాలని జిఎసిఎ ఆదేశాలు జారీ చేసింది. 'యువర్ రైట్స్ ఆర్ ప్రొటెక్టెడ్' పేరుతో వినియోగదారుల హక్కుల కోసం రూపొందించిన కొత్త ఎగ్జిక్యూటివ్ రెగ్యులేషన్స్ నేపథ్యంలో ఈ ఆదేశాల్ని జిఎసి జారీ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!









