సెల్ఫీ తీస్తే 500,000 దిర్హామ్ల జరీమానా!
- April 12, 2019యూ.ఏ.ఈ:వెడ్డింగ్ లేదా ప్రైవేట్ పార్టీల్లో అవతలి వ్యక్తుల అనుమతి లేకుండా సెల్ఫీ తీసుకుంటే అది సీరియస్ క్రైమ్గా మారే ప్రమాదముంది. ఇందుకుగాను 500,000 దిర్హామ్ల జరీమానా ఎదుర్కోవాల్సి రావొచ్చునని లాయర్ నౌరా సలెహ్ అల్ హజ్రి చెబుతున్నారు. ఇటీవలి కాలంలో ఇలాంటి ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయనీ, ఈ నేపథ్యంలో సెల్ఫీ తీసుకోవాలనుకునేవారు ఖచ్చితంగా అప్రమత్తంగా వుండాలని లాయర్ నౌరా సలెహ్ హెచ్చరించారు. సైబర్ క్రైమ్ చట్టాలు కఠినంగా వున్నాయనీ, సెల్ఫీ తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం సరదాగా మాత్రమే తీసుకుని, ఇతర విషయాల్ని పట్టించుకోకపోతే అవి సమస్యల్లోకి నెట్టేస్తాయని అధికారులు అంటున్నారు. సో, సెల్ఫీ తీసుకునే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలి. వాటిని పోస్ట్ చేసే ముందు మరింత జాగ్రత్త తీసుకోవాల్సిందే.
తాజా వార్తలు
- ఉమ్ రామూల్, అల్ బర్షాలోని ఆర్టీఏ కేంద్రాలు అప్గ్రేడ్
- దుబాయ్ కు పోటెత్తుతున్న భారతీయులు..!
- సౌదీ రాజుకు HM సుల్తాన్ సంతాపం
- టాప్ 20 ప్రపంచ కార్ మార్కెట్లలో సౌదీ అరేబియా
- ఇన్వెస్ట్ స్కామ్..బౌన్స్ చెక్కు జారీ చేసిన వ్యక్తికి జైలు శిక్ష
- యూఏఈలో వేసవి ప్రారంభం వరకు వర్షాలు..!
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు