సెల్ఫీ తీస్తే 500,000 దిర్హామ్ల జరీమానా!
- April 12, 2019
యూ.ఏ.ఈ:వెడ్డింగ్ లేదా ప్రైవేట్ పార్టీల్లో అవతలి వ్యక్తుల అనుమతి లేకుండా సెల్ఫీ తీసుకుంటే అది సీరియస్ క్రైమ్గా మారే ప్రమాదముంది. ఇందుకుగాను 500,000 దిర్హామ్ల జరీమానా ఎదుర్కోవాల్సి రావొచ్చునని లాయర్ నౌరా సలెహ్ అల్ హజ్రి చెబుతున్నారు. ఇటీవలి కాలంలో ఇలాంటి ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయనీ, ఈ నేపథ్యంలో సెల్ఫీ తీసుకోవాలనుకునేవారు ఖచ్చితంగా అప్రమత్తంగా వుండాలని లాయర్ నౌరా సలెహ్ హెచ్చరించారు. సైబర్ క్రైమ్ చట్టాలు కఠినంగా వున్నాయనీ, సెల్ఫీ తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం సరదాగా మాత్రమే తీసుకుని, ఇతర విషయాల్ని పట్టించుకోకపోతే అవి సమస్యల్లోకి నెట్టేస్తాయని అధికారులు అంటున్నారు. సో, సెల్ఫీ తీసుకునే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలి. వాటిని పోస్ట్ చేసే ముందు మరింత జాగ్రత్త తీసుకోవాల్సిందే.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







