సెల్ఫీ తీస్తే 500,000 దిర్హామ్ల జరీమానా!
- April 12, 2019
యూ.ఏ.ఈ:వెడ్డింగ్ లేదా ప్రైవేట్ పార్టీల్లో అవతలి వ్యక్తుల అనుమతి లేకుండా సెల్ఫీ తీసుకుంటే అది సీరియస్ క్రైమ్గా మారే ప్రమాదముంది. ఇందుకుగాను 500,000 దిర్హామ్ల జరీమానా ఎదుర్కోవాల్సి రావొచ్చునని లాయర్ నౌరా సలెహ్ అల్ హజ్రి చెబుతున్నారు. ఇటీవలి కాలంలో ఇలాంటి ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయనీ, ఈ నేపథ్యంలో సెల్ఫీ తీసుకోవాలనుకునేవారు ఖచ్చితంగా అప్రమత్తంగా వుండాలని లాయర్ నౌరా సలెహ్ హెచ్చరించారు. సైబర్ క్రైమ్ చట్టాలు కఠినంగా వున్నాయనీ, సెల్ఫీ తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం సరదాగా మాత్రమే తీసుకుని, ఇతర విషయాల్ని పట్టించుకోకపోతే అవి సమస్యల్లోకి నెట్టేస్తాయని అధికారులు అంటున్నారు. సో, సెల్ఫీ తీసుకునే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలి. వాటిని పోస్ట్ చేసే ముందు మరింత జాగ్రత్త తీసుకోవాల్సిందే.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









