సెల్ఫీ తీస్తే 500,000 దిర్హామ్‌ల జరీమానా!

- April 12, 2019 , by Maagulf
సెల్ఫీ తీస్తే 500,000 దిర్హామ్‌ల జరీమానా!

యూ.ఏ.ఈ:వెడ్డింగ్‌ లేదా ప్రైవేట్‌ పార్టీల్లో అవతలి వ్యక్తుల అనుమతి లేకుండా సెల్ఫీ తీసుకుంటే అది సీరియస్‌ క్రైమ్‌గా మారే ప్రమాదముంది. ఇందుకుగాను 500,000 దిర్హామ్‌ల జరీమానా ఎదుర్కోవాల్సి రావొచ్చునని లాయర్‌ నౌరా సలెహ్‌ అల్‌ హజ్రి చెబుతున్నారు. ఇటీవలి కాలంలో ఇలాంటి ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయనీ, ఈ నేపథ్యంలో సెల్ఫీ తీసుకోవాలనుకునేవారు ఖచ్చితంగా అప్రమత్తంగా వుండాలని లాయర్‌ నౌరా సలెహ్‌ హెచ్చరించారు. సైబర్‌ క్రైమ్‌ చట్టాలు కఠినంగా వున్నాయనీ, సెల్ఫీ తీసుకుని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడం సరదాగా మాత్రమే తీసుకుని, ఇతర విషయాల్ని పట్టించుకోకపోతే అవి సమస్యల్లోకి నెట్టేస్తాయని అధికారులు అంటున్నారు. సో, సెల్ఫీ తీసుకునే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలి. వాటిని పోస్ట్‌ చేసే ముందు మరింత జాగ్రత్త తీసుకోవాల్సిందే. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com