అబుదాబీ ట్యాక్సీల్లో వైఫై
- December 31, 2015
అబుదాబీ ట్యాక్సీలు ఇకపై ప్రయాణీకులకు వైఫై సౌకర్యాన్ని అందించనుంది. అయితే ఏమాత్రం అదనపు ఖర్చూ లేకుండా ప్రయాణీకులు వైఫై సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. 'వన్ టారిఫ్ ఫర్ ఆల్ సిల్వర్ ట్యాక్సీస్' అనే క్యాంపెయిన్ బుధవారం ప్రారంభమయ్యింది. అబుదాబీలోని నాలుగు ప్రాంతాల్లో ఈ క్యాంపెన్ని ప్రారంభించారు. సిల్వర్ ట్యాక్సీస్ విభాగంలో 270 మెర్సిడెస్ విటో కాంపాక్ట్ ట్యాక్సీలను కొత్తగా పొందుపరిచారు. ప్రయాణీకులకు అందించే సౌకర్యాల గురించి అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం తాలూకు ఉద్దేశ్యమని జనరల్ మేనేజర్ మహమ్మద్ దర్విష్ అల్ కెమిజి చెప్పారు. వైఫై సర్వీసులతోపాటు, చిల్డ్రన్ సేఫ్టీ కార్ సీట్స్ని తమ ట్యాక్సీలలో వినియోగిస్తున్నామని ఆయన అన్నారు. అలాగే ఎలక్ట్రానిక్ డిస్కౌంట్ కార్డులు సామాజిక సబ్సిడీ బెనిఫీసియర్స్ కోసం అందించనున్నారట. విడాకులు తీసుకున్న మహిళలకు, భర్త చనిపోయిన భార్యలతోపాటు సోషల్ సబ్సిడీ ఉన్నవారికి ఛార్జీల్లో 60 శాతం డిస్కౌంట్ ఉంటుంది
తాజా వార్తలు
- బహ్రెయిన్ BD1.384 బిలియన్లకు ఎగుమతులు..!!
- ఒమన్లో 50°C వరకు ఉష్ణోగ్రతలు..వైద్యుల హెచ్చరిక..!!
- ఖతార్లో ఈ-కామర్స్, POS లావాదేవీల్లో భారీ వృద్ధి..!!
- దుబాయ్లో వాకింగ్, సైక్లింగ్కు పెద్దపీట.. 25 ప్రాంతాల కనెక్ట్ కు కొత్త ప్రణాళిక..!!
- కువైట్ లో మెరుగైన ట్రాఫిక్ సేవలకు శ్రీకారం..!!
- సౌదీలో గృహ కార్మికుల ఇకామా రెన్యూవల్కు కొత్త విధానం..!!
- ఇరాన్ తో యుద్ధం..17 మంది అమెరికా సైనికుల మృతి
- 2026 ఫిఫా ప్రపంచకప్ విజేతగా స్పెయిన్.. అర్జెంటీనా పై 1-0తో చారిత్రాత్మక విజయం
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్







