అమల ముఖ్యపాత్రలో వెబ్సిరీస్
- April 15, 2019
శ్రీమతి అక్కినేని అమల చాలా రోజుల తర్వాత మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.. జి5 యాప్ నిర్మించిన వెబ్సిరీస్ హై ప్రిస్ట్స్లో అమల ముఖ్యపాత్ర పోషించారు.. సస్పెన్స్ థ్రిల్లర్గా రూపొందిన ఈ వెబ్సిరీస్ ఈనెల 25 నుంచి జి5 లో ఆన్లైన్ అవుతుంది.. ఈసందర్భంగా ట్రైలర్ను విడుదల చేశారు.. టారో రీడింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ వెబ్సిరీస్ను పుష్ప డైరెక్టు చేశారు. ఈ వెబ్సిరీస్లో అమలతోపాటు నటుడు బ్రహ్మాజీ, వరలక్ష్మిశరత్ కుమార్, సునైనా, బిస్బాస్ 2ఫేం నందిత తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా శ్రీమతి అమల మాట్లాడారు.. కథల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకోవటం వల్ల తెరపై తక్కువగా కన్పిస్తున్నానని, చాలా రోజుల తర్వాత పుష్పగారు చెప్పిన లైన్ నచ్చటంతో ఈ ప్రాజెక్టులో నటించేందుకు ఒప్పుకున్నానని తెలిపారు.. తనకు బాగా ఆసక్తిగా అన్పించే టారో రీడింగ్ నేపథ్యంలో ఈ వెబ్సిరీస్ కథ ఉండటం తనకు బాగా నచ్చిందన్నారు. ప్రేక్షకులకు కూడ నచ్చుతుందని అన్నారు..
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







