ఇరాన్ లో వరదలు...76 మంది మృతి
- April 15, 2019టెహ్రాన్ : ఇరాన్ దేశంలో సంభవించిన వరదలతో 76 మంది మృత్యువాత పడగా, వందలాది మంది గాయాల పాలయ్యారు. ఇరాన్ దేశంలోని ఫార్స్, హార్మోజోగన్, సిస్టాన్, బలుచిస్థాన్, ఖోరసాన్ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో వరదలు వెల్లువెత్తాయి. ఈ వరదల్లో 76 మంది మరణించారని ఇరాన్ అధికారి అహద్ వాజిపేహ్ వెల్లడించారు. ఇరాన్ లోని 25 రాష్ట్రాల్లో సంభవించిన వరదలతో వేలాది ఇళ్లు దెబ్బతిన్నాయి. దీంతో పలు కుటుంబాలు నిరాశ్రయులుగా మిగిలాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఇరాన్ అధికారులు వరద సహాయ పనులు చేపట్టారు.
తాజా వార్తలు
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు
- కువైట్లో బ్యాచిలర్లకు కొత్త కష్టాలు..!
- QR247 మిలియన్లు తిరిగి చెల్లించాలని సీఈఓను ఆదేశించిన కోర్టు
- 2023లో 99%కి చేరుకున్న సౌదీ ఇంటర్నెట్ వినియోగం
- మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం.. అగ్రస్థానంలో భారతీయులు
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ సీజన్..మరో 3 రోజులు పొడిగింపు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం