కువైట్ విమానాశ్రయంలో బాంబు కలకలం
- April 15, 2019
కువైట్: కువైట్ విమానాశ్రయంలో ఓ గుర్తు తెలియని పార్శిల్ కలకలం సృష్టించింది. కువైట్ నుంచి అమెరికాకు దాన్ని కొరియర్ చేసినట్లు విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. ఓ పుస్తకం సైజులో ఉన్న ఆ పార్శిల్ ఏంటో, ఎవరు పంపారో వివరాలు తెలియరాలేదు. ఇంటీరియర్ మంత్రిత్వ శాఖ ఆ ప్యాకేజిని పరిశోధించడానికి ఫోరెన్సిక్ నిపుణులకు పంపించింది. రొటీన్ కార్గో చెకింగ్లో భాగంగా కొరియర్ చేస్తున్న వస్తువులను పరిశీలిస్తుండగా ఈ అనుమానాస్పద పార్శిల్ బయటపడిందని అధికారులు తెలిపారు. ఈ పార్శిల్లో బాంబు ఉందేమోనని వారు అనుమానిస్తున్నారు. ఎందుకంటే పార్శిల్లో బ్యాటరీలు, డైనమైట్ తయారీలో ఉపయోగించే టీఎన్టీ అనే పదార్థం ఉన్నాయని స్పష్టం చేశారు. ఫోరెన్సిక్ నిపుణులు ఆ పార్శిల్ను పరిశీలించిన అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







