కేరళ విషు ఫెస్టివల్ సద్యా కోసం సిద్ధమైన ఖతార్ రెస్టారెంట్స్
- April 15, 2019భారతదేశంలోని కేరళ రాష్ట్రానికి చెందిన వలసదారులకోసం ఖతార్లోని రెస్టారెంట్స్ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి. కేరళ వాసులకు ఎంతో ప్రత్యేకమైన విషు ఫెస్టివల్ నేపథ్యంలో ఈ ఏర్పాట్లు చేశాయి ఆయా రెస్టారెంట్స్. ఈ ఫెస్టివల్లో ప్రత్యేకమైన మిడ్ డే మీల్ సాద్యాని అందించేందుకు రెస్టారెంట్స్ సన్నాహాలు పూర్తి చేశాయి. సాద్యాలో 24 నుంచి 28 డిషెస్ సింగిల్ కోర్స్లో వుంటాయి. అతి పెద్దది 64కి పైగా ఐటమ్స్ని కలిగి వుంటుంది. కేరళలోని వివిధ ప్రాంతాల్ని బట్టి ఇంగ్రెడియంట్స్ కొంచెం అటూ ఇటూగా మారతాయి. అన్నిటిలోనూ కామన్గా వుండే రైస్, పికెల్, దాల్, అవియాల్, కూట్టుక్కరి అతి ముఖ్యమైనవి. కేరళ వాసుల కోసం ఆయా ఆహార పదార్థాలకు సంబంధించిన ఇంగ్రెడియంట్స్ని హైపర్ మార్కెట్స్ అందుబాటులో వుంచాయి. ఇంట్లో వంట చేసుకునే తీరిక లేనివారికి రెస్టారెంట్స్ అద్భుతమైన రుచితో సాద్యా ప్యాకేజీలను రూపొందించి అందుబాటులోకి తెచ్చాయి.
తాజా వార్తలు
- ఏపీలో భానుడి విశ్వరూపం, బెంబేలెత్తిపోతున్న జనం
- వైసీపీ మేనిఫెస్టో ఫై ప్రశ్నల అస్త్రాలను సంధిస్తున్న నెటిజన్లు
- ఎన్నికల ప్రచారంలో హీరో వెంకటేశ్..?!!
- ఖతార్ విమానయాన రంగం.. అద్భుతమైన వృద్ధి..!
- సలాలా ఆటిజం సెంటర్.. ఆటిస్టిక్ పిల్లలకు వరం..!
- కాలువల్లో చనిపోయిన చేపలు.. మున్సిపాలిటీ క్లారిటీ
- యాంటీబయాటిక్స్ నిల్..పుకార్లను నమ్మొద్దు
- 15 ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదు.. అలర్ట్ జారీ
- 'రామాయణం' షూటింగ్ సెట్ నుంచి రణబీర్ కపూర్, సాయి పల్లవి ఫోటోలు లీక్..
- ముంబైలో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు..కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం