బాటాకు చేదు అనుభవం
- April 15, 2019
చండీగఢ్:నిజానికి దినేష్ ప్రసాద్ గారిలా రోజువారీ కొనుగోళ్లలో ఎంతో నష్టపోతుంటాడు వినియోగ దారుడు. అన్యాయంగా డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రశ్నించే టైము, వాగ్యుద్ధానికి దిగే ఓపిక ఎవరికీ ఉండట్లేదు. పంజాబ్ చండీగఢ్కి చెందిన దినేష్ బాటా షోరూంకి వెళ్లి బూట్లు కొనుగోలు చేశారు. వాటి రేటు రూ.402లు, షూస్ని పేపర్ బ్యాగ్లో పెట్టిస్తూ దాని బ్యాగ్ రేటు రూ.3లు అని బిల్లులో వేశారు.
దానికి ఆగ్రహం చెందిన దినేష్ మీ షోరూం ప్రమోషన్ కోసం బాటా లోగో వేసిన ఉన్న బ్యాగ్ ఇస్తూ.. పైపెచ్చు దానికి మా దగ్గర డబ్బులు వసూలు చేస్తారా అని యాజమాన్యం మీద రివర్సయ్యాడు. ఆ 3రూ.లు నేనివ్వను. ఫ్రీగా ఇవ్వండి బ్యాగ్ అని అడిగాడు. దానికి యాజమాన్యం ఒప్పుకోలేదు. దీంతో దీనేష్ వెళ్లి వినియోగదారుల ఫోరంలో కేసు నమోదు చేశాడు. దినేష్ వాదనను విన్న ఫోరం.. బాటాకు జరిమానా విధించింది.
పేపర్ బ్యాగ్కి బలవంతంగా రూ.3లు వసూలు చేయడం సేవలలో లోపమేనని వినియోగదారుల ఫోరం స్పష్టం చేసింది. కస్టమర్లు ఉత్పత్తులు కొనుగోలు చేసినప్పుడు పేపర్ బ్యాగ్ ఉచితంగా ఇవ్వాలని పేర్కొంది. వ్యాజ్యంకు రూ.1000, మానసిక ఆందోళనకు రూ.3000, లీగల్ ఎయిడ్ నిధికి రూ.5,000లు, కంప్లైంట్ చేయడానికి అయిన ఖర్చు రూ.1000లు చెల్లించమంటూ బాటాని ఆదేశించింది.
ప్రతి వినియోగదారుడికి ఉచితంగా క్యారీ బ్యాగ్ అందజేయాలని ఆదేశించింది. చాలా స్టోర్లలో క్యారీ బ్యాగ్ పేరుతో రూ.3 నుంచి రూ.5లు వసూలు చేస్తుంటారు. అడిగేవారు లేకపోవడంతో అడ్డంగా దోచేస్తున్నారు. దినేష్ ప్రసాద్ లాంటి వ్యక్తులు సమాజానికి ఎంతైనా అవసరం.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







