దుబాయ్లో శ్రీ గణపతి సచ్చిదానంద 'పూర్ణ చంద్ర రాగ సాగర'
- April 16, 2019దుబాయ్:దత్త యోగ సెంటర్, యూఏఈ నేతృత్వంలో పూర్ణ చంద్ర రాగసాగర పేరుతో మ్యూజిక్ ఫర్ మెడిటేషన్ అనే ఈవెంట్ని నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 19న ఈ ఈవెంట్ జరుగుతుంది. శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ సింథసైజర్పై పెర్ఫామ్ చేయబోతున్నారు. ప్రముఖ వయోలిన్ కళాకారుడు డాక్టర్ ఎల్ సుబ్రహ్మణ్యం కూడా తన ప్రదర్శనను ఇవ్వబోతున్నారు. పండిట్ అనిందో చటర్జీ తబ్లా మరియు విద్వాన్ వి సురేష్ ఘటమ్ ఇతర ప్రధాన ఆకర్షణలు కానున్నాయి. ఆధ్మాత్మిక గురువు అయిన గణపతి సచ్చిదానంద స్వామీజీ గ్రేట్ మ్యుజీషియన్ కూడా.పలు దేశాల్లో ఇప్పటికే ఆయన అనేక ప్రదర్శనలు ఇచ్చి వున్నారు. ఆయన సంగీతం వినేవారికి సరికొత్త అనుభూతిని మిగుల్చుతుంది. 300కి పైగా మ్యూజిక్ కాన్సెర్ట్స్లో స్వామీజీ పాల్గొన్నారు. ఐ ట్యూన్స్, ప్లే స్టోర్లో 250కి పైగా మ్యూజిక్ ఆల్బమ్స్ కూడా ఆయనవి అందుబాటులో వున్నాయి. దుబాయ్ ఒపెరాలో స్వామీజీ మ్యూజిక్ కాన్సెర్ట్ కోసం ఏర్పాట్లు ఇప్పటికే జోరందుకున్నాయి.
తాజా వార్తలు
- ఓటింగ్ సరళి విపరీతంగా పెరిగే అవకాశం!
- తిరిగి విధుల్లో చేరిన ఎయిరిండియా ఎక్స్ప్రెస్ క్యాబిన్ సిబ్బంది!
- తెలంగాణలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన..
- లోక్సభ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: డీజీపీ రవిగుప్తా
- అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తు, ఫీజు, ప్రక్రియ
- దుబాయ్లో పెట్టుబడి ద్వారా ఉద్యోగి గోల్డెన్ వీసాకు మారవచ్చా?
- బహ్రెయిన్ చేరుకున్న అరబ్ లీగ్ చీఫ్
- మోసపూరిత ప్రకటనల పై సౌదీ హెచ్చరిక
- కువైట్ అమీర్ కు వ్యతిరేకంగా పోస్టులు..పలువురికి నోటీసులు
- 250 మంది ప్రవాసులకు ఒమానీ పౌరసత్వం