శబరిమల పిటిషన్ కి ధీటుగా సుప్రీం లో ముస్లింల పిటిషన్..
- April 16, 2019
న్యూఢిల్లీ: మసీదుల్లోకి మహిళా ప్రవేశం చేయొచ్చా లేదా అనే అంశంపై విచారణ చేసేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఎటువంటి ఆంక్షలు లేకుండా ఆ అంశంపై పిటిషన్ను పరిశీలించినట్లు అత్యున్నత న్యాయస్థానం వెల్లడించింది. ఇదే అంశానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి, సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు కూడా సుప్రీం కోర్టు నోటీసులు ఇచ్చింది. అన్ని వయసుల మహిళలు శబరిమల ఆలయ ప్రవేశం చేయోచ్చంటూ ఇటీవల సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తీర్పు ఆధారంగానే తాము మసీదుల్లోకి ముస్లిం మహిళలు వెళ్లవచ్చా అనే అంశాన్ని తేల్చాలని భావిస్తున్నట్లు కోర్టు తెలిపింది. ఈ పిటిషన్ను మహారాష్ట్రకు చెందిన ఓ జంట వేసింది. మహిళలను మసీదులోకి ప్రవేశించకుండా అడ్డుకోవడం అక్రమమని పిటిషన్లో తెలిపారు. అది రాజ్యాంగ వ్యతిరేకమన్నారు. దీంతో 14, 15, 21, 25, 29 ఆర్టికల్స్ను ఉల్లంఘించినట్లు అవుతుందని కూడా పిటిషన్లో తెలిపారు. ఏ మత గురువు కూడా మసీదుకు వెళ్లరాదని అని చెప్పలేదని పిటిషన్లో చెప్పారు. స్త్రీ పురుషులను ఖురాన్ వేరువేరుగా చూడలేదన్నారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







