ఆహారంలో పురుగు: ఇండియన్ రెస్టారెంట్ మూసివేత
- April 18, 2019
అబుదాబీ ఫుడ్ కంట్రోల్ అథారిటీ, ముస్సాఫ్ఫా ప్రాంతంలోని మిదిన్ రెస్టారెంట్ని మూసివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఫుడ్ సేఫ్టీ విషయమై పలు మార్లు వార్నింగ్స్ ఇచ్చినా రెస్టారెంట్ యాజమాన్యం కనీస జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలమయ్యిందని అధికారులు పేర్కొన్నారు. పెస్ట్ కంట్రోల్ సర్వీసెస్ అప్లయ్ చేయడం, సాధారణ హైజీన్ కండిషన్స్ని పాటించకపోవడం వంటి కారణాలతో ఇండియన్ రెస్టారెంట్ని మూసివేశామని అధికారులు వివరించారు. ఎడిఎఫ్సిఎ ప్రతినిధి తమీర్ రషెద్ అల్ కాసెమి మాట్లాడుతూ, అసాధారణ రూమ్ టెంపరేచర్స్ మధ్య ఆహారాన్ని నిల్వ చేస్తున్నారనీ, కూరగాయలు ఓపెన్గా వుంచేస్తున్నారనీ, ఈ కారణంగా ఇన్సెక్ట్స్ పెరుగుతున్నాయని తాము గుర్తించినట్లు చెప్పారు. గత ఏడాది రెండు వార్నింగ్స్, ఈ ఏడాది ఇప్పటికే రెండు వార్నింగ్స్ ఇచ్చినా రెస్టారెంట్ తీరు మారకపోవడంతో మూసివేసినట్లు ఆయన వివరించారు. అపరిశుభ్రావాతావరణంపై సాధారణ ప్రజలు ఫిర్యాదు చేయాలని పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







