ఆహారంలో పురుగు: ఇండియన్ రెస్టారెంట్ మూసివేత
- April 18, 2019
అబుదాబీ ఫుడ్ కంట్రోల్ అథారిటీ, ముస్సాఫ్ఫా ప్రాంతంలోని మిదిన్ రెస్టారెంట్ని మూసివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఫుడ్ సేఫ్టీ విషయమై పలు మార్లు వార్నింగ్స్ ఇచ్చినా రెస్టారెంట్ యాజమాన్యం కనీస జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలమయ్యిందని అధికారులు పేర్కొన్నారు. పెస్ట్ కంట్రోల్ సర్వీసెస్ అప్లయ్ చేయడం, సాధారణ హైజీన్ కండిషన్స్ని పాటించకపోవడం వంటి కారణాలతో ఇండియన్ రెస్టారెంట్ని మూసివేశామని అధికారులు వివరించారు. ఎడిఎఫ్సిఎ ప్రతినిధి తమీర్ రషెద్ అల్ కాసెమి మాట్లాడుతూ, అసాధారణ రూమ్ టెంపరేచర్స్ మధ్య ఆహారాన్ని నిల్వ చేస్తున్నారనీ, కూరగాయలు ఓపెన్గా వుంచేస్తున్నారనీ, ఈ కారణంగా ఇన్సెక్ట్స్ పెరుగుతున్నాయని తాము గుర్తించినట్లు చెప్పారు. గత ఏడాది రెండు వార్నింగ్స్, ఈ ఏడాది ఇప్పటికే రెండు వార్నింగ్స్ ఇచ్చినా రెస్టారెంట్ తీరు మారకపోవడంతో మూసివేసినట్లు ఆయన వివరించారు. అపరిశుభ్రావాతావరణంపై సాధారణ ప్రజలు ఫిర్యాదు చేయాలని పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







