ఆహారంలో పురుగు: ఇండియన్ రెస్టారెంట్ మూసివేత
- April 18, 2019అబుదాబీ ఫుడ్ కంట్రోల్ అథారిటీ, ముస్సాఫ్ఫా ప్రాంతంలోని మిదిన్ రెస్టారెంట్ని మూసివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఫుడ్ సేఫ్టీ విషయమై పలు మార్లు వార్నింగ్స్ ఇచ్చినా రెస్టారెంట్ యాజమాన్యం కనీస జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలమయ్యిందని అధికారులు పేర్కొన్నారు. పెస్ట్ కంట్రోల్ సర్వీసెస్ అప్లయ్ చేయడం, సాధారణ హైజీన్ కండిషన్స్ని పాటించకపోవడం వంటి కారణాలతో ఇండియన్ రెస్టారెంట్ని మూసివేశామని అధికారులు వివరించారు. ఎడిఎఫ్సిఎ ప్రతినిధి తమీర్ రషెద్ అల్ కాసెమి మాట్లాడుతూ, అసాధారణ రూమ్ టెంపరేచర్స్ మధ్య ఆహారాన్ని నిల్వ చేస్తున్నారనీ, కూరగాయలు ఓపెన్గా వుంచేస్తున్నారనీ, ఈ కారణంగా ఇన్సెక్ట్స్ పెరుగుతున్నాయని తాము గుర్తించినట్లు చెప్పారు. గత ఏడాది రెండు వార్నింగ్స్, ఈ ఏడాది ఇప్పటికే రెండు వార్నింగ్స్ ఇచ్చినా రెస్టారెంట్ తీరు మారకపోవడంతో మూసివేసినట్లు ఆయన వివరించారు. అపరిశుభ్రావాతావరణంపై సాధారణ ప్రజలు ఫిర్యాదు చేయాలని పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం