కువైట్లో వలసదారులకు హెల్త్ ఫీజు పెంపు
- April 18, 2019కువైట్ సిటీ: మినిస్టర్ ఆఫ్ హెల్త్ షేక్ డాక్టర్ బస్సెల్ అల్ సభా, పబ్లిక్ హాస్పిటల్స్ని సందర్శించే పేషెంట్లకు కాజువాల్టీ ఫీజును 5 కువైటీ దినార్స్ నుంచి 10 కువైటీ దినార్స్కి పెంచుతూ మినిస్టీరియల్ డెసిషన్ని జారీ చేశారు. క్యాజువాలిటీ యూనిట్స్లో ఒత్తిడిని తగ్గించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మినిస్ట్రీ వివరించింది. ముందుగా తమ సమీపంలోని క్లినిక్స్లో మాత్రమే పేషెంట్స్ సందర్శించి, అవసరమైనప్పుడు ఆసుపత్రికి వచ్చేలా ఈ కొత్త నిర్ణయం తోడ్పడుతుందని మినిస్ట్రీ పేర్కొంది. ఇదిలా వుంటే, టీనేజర్స్ ఆరోగ్యానికి సంబంధించి నేషనల్ స్ట్రేటజీ తయారు చేసేందుకోసం ఓ కమిటీని ఏర్పాటు చేయాలని మినిస్టర్ నిర్ణయించారు. డైరెక్టర్ ఆఫ్ స్కూల్ హెల్త్ డిపార్ట్మెంట్, డైరెక్టర్ ఆఫ్ సోషల్ హెల్త్ డిపార్ట్మెంట్, డైరెక్టర్ ఆఫ్ ప్రైమరీ హెల్త్ కేర్ డిపార్ట్మెంట్, డైరెక్టర్ ఆఫ్ కువైట్ సెంటర్ ఫర్ మెంటల్ హెల్త్, డైరెక్టర్ ఆఫ్ నేషనల్ సెంటర్ ఫర్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ఇందులో మెంబర్స్గా వుంటారు. రాపోటర్గా డైరెక్టర్ ఆఫ్ పిడియాట్రిక్ డిపార్ట్మెంట్స్ బోర్డ్ వ్యవహరిస్తారు.
తాజా వార్తలు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్