కువైట్లో వలసదారులకు హెల్త్ ఫీజు పెంపు
- April 18, 2019కువైట్ సిటీ: మినిస్టర్ ఆఫ్ హెల్త్ షేక్ డాక్టర్ బస్సెల్ అల్ సభా, పబ్లిక్ హాస్పిటల్స్ని సందర్శించే పేషెంట్లకు కాజువాల్టీ ఫీజును 5 కువైటీ దినార్స్ నుంచి 10 కువైటీ దినార్స్కి పెంచుతూ మినిస్టీరియల్ డెసిషన్ని జారీ చేశారు. క్యాజువాలిటీ యూనిట్స్లో ఒత్తిడిని తగ్గించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మినిస్ట్రీ వివరించింది. ముందుగా తమ సమీపంలోని క్లినిక్స్లో మాత్రమే పేషెంట్స్ సందర్శించి, అవసరమైనప్పుడు ఆసుపత్రికి వచ్చేలా ఈ కొత్త నిర్ణయం తోడ్పడుతుందని మినిస్ట్రీ పేర్కొంది. ఇదిలా వుంటే, టీనేజర్స్ ఆరోగ్యానికి సంబంధించి నేషనల్ స్ట్రేటజీ తయారు చేసేందుకోసం ఓ కమిటీని ఏర్పాటు చేయాలని మినిస్టర్ నిర్ణయించారు. డైరెక్టర్ ఆఫ్ స్కూల్ హెల్త్ డిపార్ట్మెంట్, డైరెక్టర్ ఆఫ్ సోషల్ హెల్త్ డిపార్ట్మెంట్, డైరెక్టర్ ఆఫ్ ప్రైమరీ హెల్త్ కేర్ డిపార్ట్మెంట్, డైరెక్టర్ ఆఫ్ కువైట్ సెంటర్ ఫర్ మెంటల్ హెల్త్, డైరెక్టర్ ఆఫ్ నేషనల్ సెంటర్ ఫర్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ఇందులో మెంబర్స్గా వుంటారు. రాపోటర్గా డైరెక్టర్ ఆఫ్ పిడియాట్రిక్ డిపార్ట్మెంట్స్ బోర్డ్ వ్యవహరిస్తారు.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం