తమిళనాడు పోలింగ్.. ఓటేసిన సినీ ప్రముఖులు
- April 18, 2019దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్ ఈ రోజు (గురువారం) ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైంది. దేశంలోని 11 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని మొత్తం 95 నియోజకవర్గాల్లో రెండో దశ పోలింగ్ జరుగుతోంది. సామాన్య ప్రజలతోపాటు సినీ ప్రముఖులు కూడా ఓటేసేందుకు క్యూ కట్టారు. తమిళ ప్రముఖ నటులు సూర్య, కార్తి, జ్యోతిక క్యూలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే సూపర్స్టార్ రజినీకాంత్ ఓటేసేందుకు ముంబై నుంచి తమిళనాడు వచ్చారు. మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు, విశ్వనటుడు కమల్ హాసన్, ఆయన కుమార్తె శ్రుతి హాసన్ చెన్నైలోని ఆల్వార్పేటలో క్యూలో నిలుచుని ఓటేశారు. ఇక, తమిళ స్టార్ హీరో అజిత్, ఆయన భార్య షాలినీ, మరో స్టార్ హీరో విజయ్, `బిచ్చగాడు` హీరో విజయ్ కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు.
తాజా వార్తలు
- పాఠశాలలకు బాంబు బెదిరింపుల కలకలం..
- ముబారక్ అల్-కబీర్ను కలిసిన భారత రాయబారి
- ఖతార్లో ఆహార భద్రతపై మంత్రిత్వ శాఖ క్లారిటీ
- యూఏఈలో భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ..!
- ఈ రోజుల్లో ఒమానీలకు ఉచిత బస్సు సేవలు
- పీక్ అవర్స్ కోసం దుబాయ్ మెట్రో కొత్త ప్రోటోకాల్స్
- టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో విడుదల..
- మీ వాట్సాప్ గ్రీన్ కలర్లోకి మారిందా?
- టీ20 వరల్డ్ కప్ కోసం భారత జట్టును ప్రకటించిన BCCI
- మే నెలలో పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు