షార్జా ఛారిటీ ఇంటర్నేషనల్: 41 మిలియన్ దిర్హామ్ల రమదాన్ సాయం
- April 22, 2019
షార్జాలోని ఓ ఛారిటీ 41 మిలియన్ దిర్హామ్ల ఛారిటీ క్యాంపెయిన్ని ఈ ఏడాది రమదాన్ కోసం కేటాయించింది. తద్వారా అవసరమైనవారికి దేశంలోనూ, అలాగే విదేశాల్లోనూ రమదాన్ సాయం అందిచనున్నామని నిర్వాహకులు తెలిపారు. షార్జా ఛారిటీ ఇంటర్నేషనల్ సెక్రెటరీ జనరల్ అబ్దుల్లా అల్ దుకాన్ మాట్లాడుతూ, పవిత్ర రమదాన్ మాసం కోసం ఐదు ఛారిటబుల్ ప్రాజెక్ట్లకు మద్దతిస్తున్నట్లు తెలిపారు. 2 మిలియన్ దిర్హామ్ల విలువైన మీల్స్ని 3,000 కుటుంబాలకు అందించడం ఇందులో మొదటిది. 1 మిలియన్ ఇఫ్తార్ మీల్స్ని 148 ప్రాంతాల్లో (యూఏఈ), 56 దేశాల్లో 200,000 మీల్స్ అందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జకాత్ అకౌంట్ ద్వారా 15 మిలియన్ దిర్హామ్లను వినియోగిస్తారు. పవిత్ర రమదాన్ మాసం ముగిశాక జకత్ అల్ ఫితర్ డిస్ట్రిబ్యూషన్ కోసం 2 మిలియన్ దిర్హామ్లను కేటాయిస్తున్నారు. పెద్దయెత్తున మంచి మనసున్నవారి నుంచి అందుతున్న నిధులతో ఇవన్నీ చేయగలుగుతున్నట్లు అల్ దుఖాన్ చెప్పారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







