శ్రీలంక పేలుళ్ళను ఖండించిన సుల్తానేట్
- April 22, 2019
మస్కట్: అత్యంత కిరాతకంగా జరిగిన వరుస పేలుళ్ళు శ్రీలంకలో పరిస్థితిని భీతావహంగా మార్చేయడంపై ఒమన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. పేలుళ్ళను ఖండిస్తూ మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్ ఓ ప్రకటన విడుదల చేసింది. తీవ్రవాదం ఏ రూపంలో వున్నా, దాన్ని అంతమొందించాల్సిందేననీ, ఈ కష్టకాలంలో శ్రీలంకకు తాము అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని ఒమన్ పేర్కొంది. ప్రస్తుతం శ్రీలంకలో వున్న ఒమన్ పౌరుల భద్రత విషయమై అక్కడి ఎంబసీతో మినిస్ట్రీ సంప్రదింపులు జరుపుతోంది. ఈ మేరకు ఫోన్ నెంబర్లను ప్రకటనలో పేర్కొని, అత్యవసర సందర్భాల్లో ఒమన్ పౌరులు, శ్రీలంకలో ఈ నెంబర్లను సంప్రదించాలని కోరింది.
తాజా వార్తలు
- చైనాలో అధికారిక పర్యటనకు అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ బీజింగ్ చేరిక
- ముంబై పై బెంగళూరు ఘన విజయం
- ఐటీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
- లక్నో పై గుజరాత్ ఘన విజయం
- స్కామ్ వివాదం పై నోరువిప్పిన సింగర్ మంగ్లీ
- భారత విదేశాంగ మంత్రి జైశంకర్కు యూఏఈ అధ్యక్షుడు ఘన స్వాగతం..
- ట్రంప్ సంచలన ప్రకటన..
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!









