శ్రీలంక పేలుళ్ళలో దుబాయ్ రెసిడెంట్ మృతి
- April 22, 2019దుబాయ్: శ్రీలంక పేలుళ్ళలో దుబాయ్ రెసిడెంట్ ఒకరు మృతి చెందడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. 61 ఏళ్ళ రజినా, షాంగ్రి లా హోటల్లో జరిగిన పేలుడులో ప్రాణాలు కోల్పోయారు. కేరళలోని కసార్గోడ్ నుంచి దుబాయ్కి వచ్చి, ఇక్కడే స్థిరపడ్డారామె. వాస్తవానికి రజినా, శ్రీలంక జాతీయురాలు. పెళ్ళి తర్వాత ఆమె కేరళలో తన భర్త వద్దనే వుండేవారు. ఆ తర్వాత మిడిల్ ఈస్ట్లోని పలు దేశాల్లో కుటుంబంతో సహా నివసించారు. గత కొన్నాళ్ళుగా ఆమె కుటుంబం దుబాయ్లోనే స్థిరపడింది. రజినా, ఆమె భర్త శ్రీలంకలోని ఆమె సోదరుడు బషీర్ని, ఇతర కుటుంబ సభ్యుల్ని కలిసేందుకు వెళ్ళారు. అయితే ఇంతలోనే దురదృష్టకర ఘటన జరిగిపోయింది. బాధితురాలి పిల్లలు అమెరికాలో వుంటున్నారని కుటుంబ సభ్యుల్లో ఒకరైన బీరన్ చెప్పారు.
తాజా వార్తలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు
- కువైట్లో బ్యాచిలర్లకు కొత్త కష్టాలు..!