తెల్లకార్డులు లేకున్నాఆస్పత్రుల్లో ఉచిత చికిత్స..

- December 31, 2015 , by Maagulf
తెల్లకార్డులు లేకున్నాఆస్పత్రుల్లో ఉచిత చికిత్స..

ఏపీలో ప్రాణాంతక వ్యాధుల బారిన పడి అత్యవసర చికిత్స చేయించుకోలేని స్థితిలో ఉన్న పేద ప్రజలకు ప్రభుత్వం కొత్త సంవత్సరం సందర్భంగా చల్లని కబురందించింది. తెల్లకార్డులు లేకున్నా రోగులకు ప్రభుత్వం సూచించిన స్పెషాలిటీ ఆస్పత్రుల్లో ఉచిత చికిత్స అందించాలని ఉత్తర్వులు జారీ చేసింది. రోగులకు సీఎంసీవో రెఫరల్‌ కార్డులు తీసుకోవాలని, ప్రతి రెఫరల్‌ కార్డుకు ఓ నెంబర్‌ ఆధారంగా వైద్య సేవలు అందించాలని ఆస్పత్రులకు సూచించింది. సీఎం సహాయనిధి నుంచి ఆన్‌లైన్‌లో ఆ మొత్తాన్ని చెల్లించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. డబ్బు తీసుకున్నట్లు ట్రస్ట్‌ దృష్టికి వస్తే క్లెయిమ్స్‌ రద్దు చేస్తామని హెచ్చరించింది. రెఫరల్‌ కార్డులు హైదరాబాద్‌లో క్యాంప్‌ ఆఫీసు, ట్రస్ట్‌ క్లినిక్‌, విజయవాడ, విశాఖ, తిరుపతి, కర్నూలు, కాకినాడ ప్రభుత్వాస్పత్రుల్లో జారీ చేయనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com