తెల్లకార్డులు లేకున్నాఆస్పత్రుల్లో ఉచిత చికిత్స..
- December 31, 2015
ఏపీలో ప్రాణాంతక వ్యాధుల బారిన పడి అత్యవసర చికిత్స చేయించుకోలేని స్థితిలో ఉన్న పేద ప్రజలకు ప్రభుత్వం కొత్త సంవత్సరం సందర్భంగా చల్లని కబురందించింది. తెల్లకార్డులు లేకున్నా రోగులకు ప్రభుత్వం సూచించిన స్పెషాలిటీ ఆస్పత్రుల్లో ఉచిత చికిత్స అందించాలని ఉత్తర్వులు జారీ చేసింది. రోగులకు సీఎంసీవో రెఫరల్ కార్డులు తీసుకోవాలని, ప్రతి రెఫరల్ కార్డుకు ఓ నెంబర్ ఆధారంగా వైద్య సేవలు అందించాలని ఆస్పత్రులకు సూచించింది. సీఎం సహాయనిధి నుంచి ఆన్లైన్లో ఆ మొత్తాన్ని చెల్లించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. డబ్బు తీసుకున్నట్లు ట్రస్ట్ దృష్టికి వస్తే క్లెయిమ్స్ రద్దు చేస్తామని హెచ్చరించింది. రెఫరల్ కార్డులు హైదరాబాద్లో క్యాంప్ ఆఫీసు, ట్రస్ట్ క్లినిక్, విజయవాడ, విశాఖ, తిరుపతి, కర్నూలు, కాకినాడ ప్రభుత్వాస్పత్రుల్లో జారీ చేయనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







