తెల్లకార్డులు లేకున్నాఆస్పత్రుల్లో ఉచిత చికిత్స..
- December 31, 2015
ఏపీలో ప్రాణాంతక వ్యాధుల బారిన పడి అత్యవసర చికిత్స చేయించుకోలేని స్థితిలో ఉన్న పేద ప్రజలకు ప్రభుత్వం కొత్త సంవత్సరం సందర్భంగా చల్లని కబురందించింది. తెల్లకార్డులు లేకున్నా రోగులకు ప్రభుత్వం సూచించిన స్పెషాలిటీ ఆస్పత్రుల్లో ఉచిత చికిత్స అందించాలని ఉత్తర్వులు జారీ చేసింది. రోగులకు సీఎంసీవో రెఫరల్ కార్డులు తీసుకోవాలని, ప్రతి రెఫరల్ కార్డుకు ఓ నెంబర్ ఆధారంగా వైద్య సేవలు అందించాలని ఆస్పత్రులకు సూచించింది. సీఎం సహాయనిధి నుంచి ఆన్లైన్లో ఆ మొత్తాన్ని చెల్లించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. డబ్బు తీసుకున్నట్లు ట్రస్ట్ దృష్టికి వస్తే క్లెయిమ్స్ రద్దు చేస్తామని హెచ్చరించింది. రెఫరల్ కార్డులు హైదరాబాద్లో క్యాంప్ ఆఫీసు, ట్రస్ట్ క్లినిక్, విజయవాడ, విశాఖ, తిరుపతి, కర్నూలు, కాకినాడ ప్రభుత్వాస్పత్రుల్లో జారీ చేయనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







