లంకలో పేలిన మరో బాంబు
- April 25, 2019
కొలంబో: వరుస బాంబు దాడి ఘటనలతో శ్రీలంక దద్దరిల్లుతోంది. గురువారం ఉదయం రాజధాని కొలంబోకు 40 కిలోమీటర్లు దూరంలో ఉన్న పుగోడా పట్టణంలో పేలుడు సంభవించినట్లు పోలీసు అధికారులు తెలిపారు. దాంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. అయితే ఈ దాడిలో ఎవరైనా గాయపడ్డారా? అన్న వివరాలు తెలియాల్సి ఉంది.
ఆదివారం జరిగిన భయానక దాడుల ఘటన మరువక ముందే శ్రీలంకలో మరిన్ని పేలుళ్లు సంభవిస్తున్నాయి. పోలీసులు నిర్వరామంగా తనిఖీలు నిర్వహిస్తున్నప్పటికీ ఎక్కడో ఓ చోట పేలుడు సంభవిస్తూనే ఉంది. బుధవారం సినిమా థియేటర్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రమూకలు ఓ బైక్లో బాంబు అమర్చారు. దాన్ని గ్రహించిన పోలీసులు నిర్వీర్యం చేసే క్రమంలో అది పేలింది. ఆదివారం జరిగిన బాంబు పేలుడు ఘటనల్లో మృతుల సంఖ్య 321కి చేరింది.
తాజా వార్తలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!







