లంకలో పేలిన మరో బాంబు

- April 25, 2019 , by Maagulf
లంకలో పేలిన మరో బాంబు

కొలంబో: వరుస బాంబు దాడి ఘటనలతో శ్రీలంక దద్దరిల్లుతోంది. గురువారం ఉదయం రాజధాని కొలంబోకు 40 కిలోమీటర్లు దూరంలో ఉన్న పుగోడా పట్టణంలో పేలుడు సంభవించినట్లు పోలీసు అధికారులు తెలిపారు. దాంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. అయితే ఈ దాడిలో ఎవరైనా గాయపడ్డారా? అన్న వివరాలు తెలియాల్సి ఉంది.

ఆదివారం జరిగిన భయానక దాడుల ఘటన మరువక ముందే శ్రీలంకలో మరిన్ని పేలుళ్లు సంభవిస్తున్నాయి. పోలీసులు నిర్వరామంగా తనిఖీలు నిర్వహిస్తున్నప్పటికీ ఎక్కడో ఓ చోట పేలుడు సంభవిస్తూనే ఉంది. బుధవారం సినిమా థియేటర్‌ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రమూకలు ఓ బైక్‌లో బాంబు అమర్చారు. దాన్ని గ్రహించిన పోలీసులు నిర్వీర్యం చేసే క్రమంలో అది పేలింది. ఆదివారం జరిగిన బాంబు పేలుడు ఘటనల్లో మృతుల సంఖ్య 321కి చేరింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com