ఒక్క బటన్ క్లిక్తో దుబాయ్ పోలీసుల్ని రీచ్ అవ్వొచ్చు
- April 25, 2019
దుబాయ్ పోలీస్, ఓ స్మార్ట్ డివైజ్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.. ఈ డివైజ్ ద్వారా ఒక్క బటన్ క్లిక్తోనే దుబాయ్ పోలీస్ ఆపరేషన్స్ రూమ్కి అనుసంధానమవ్వొచ్చు. ఎస్పిఎస్ ఎక్స్ప్రెస్ పేరుతో దీన్ని రూపొందిస్తున్నారు. ఇందులో ఎమర్జన్సీ ఫోన్ టవర్ వుంటుంది. అల్ రిగ్గా ప్రాంతంలో దీన్ని ఇప్పటికే అమర్చి, పరిశోధిస్తున్నారు. అల్ మురాక్కాబాత్ పోలీస్ స్టేషన్ డైరెక్టర్ బ్రిగేడియర్ అలి ఘానిమ్ మాట్లాడుతూ, అన్ని టెస్టులూ పాస్ అయితే ఎస్పిఎస్ ఎక్స్ప్రెస్ని ఎమిరేట్ వ్యాప్తంగా ఎయిర్ పోర్టులు, పార్కులు, సౌక్స్ మరియు ప్రముఖ లొకేషన్లలో ఏర్పాటు చేస్తామని అన్నారు. అత్యవసర సమయాల్లో పోలీసులకు సమాచారమందించడానికి ఈ స్మార్ట్ డివైజ్ ఎంతగానో ఉపయోగపడ్తుందని అధికారులు పేర్కొన్నారు. హెచ్డి సిఎంఓఎస్ కెమెరా, నైట్ విజన్, వీడియో మరియు ఆడియో టాక్ ఫీచర్స్, రిమోట్ మానిటర్ మరియు బ్రాడ్ కాస్ట్, అలార్మ్ ఇంటిగ్రేషన్, ఎక్సెలెంట్ వండల్ ప్రూఫ్ ఐపి65 మరియు ఐకె 10 కలిగి వుంటుంది ఈ డివైజ్. 4జి ఎల్టియి, వైఫై కనెక్షన్స్ మాడ్యూల్స్ కూడా వుంటాయిందులో.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







