శ్రీలంక ఫ్లాగ్ రంగులతో అబుధాబిలోని ప్రముఖ భవనాల వెలుగులు
- April 25, 2019
అబుధాబి:శ్రీలంకలో తీవ్రవాద దాడుల్లో బలైపోయినవారికి సంతాప సూచకంగా అలాగే బాధిత కుటుంబాలకు సానుభూతి తెలుపుతూ, శ్రీలంక సమాజానికి మద్దతుగా అబుదాబీలోని ప్రముఖ నిర్మాణాలకు శ్రీలంక జెండాలోని రంగులతో వెలుగులు నింపారు. ఎమిరేట్స్ ప్యాలెస్, షేక్ జాయెద్ బ్రిడ్జి, అడ్నాక్ బిల్డింగ్, క్యాపిటల్ గేట్ వంటి భవనాలు శ్రీలంక ఫ్లాగ్లోని రంగుతో నిండిపోయేలా లైటింగ్ని అమర్చారు. ఇదిలా వుంటే అధికారిక వివరాల ప్రకారం శ్రీలంక పేలుళ్ళలో మృతుల సంఖ్య 350కి పైగా నమోదయిన సంగతి తెల్సిందే. ఇప్పటికే యూఏఈ పాలకులు, శ్రీలంకపై తీవ్రవాద దాడిని ఖండించారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









