శ్రీలంక పేలుళ్ళలో మరో భారతీయ వలసదారుడి మృతి

- April 25, 2019 , by Maagulf
శ్రీలంక పేలుళ్ళలో మరో భారతీయ వలసదారుడి మృతి

శ్రీలంకలో ఇటీవల జరిగిన బాంబు పేలుళ్ళలో భారతదేశానికి చెందిన జునో శ్రీవాస్తవ ప్రాణాలు కోల్పోయినట్లు దుబాయ్‌లోని కాన్సుల్‌ జనరల్‌ విపుల్‌ వెల్లడించారు. జునో శ్రీవాస్తవ, దుబాయ్‌లో వుంటున్నారు. కొలంబోలోని సినామన్‌ గ్రాండ్‌ హోటల్‌లో జరిగిన పేలుళ్ళలో జునో ప్రాణాలు కోల్పోయినట్లు వివరించారు విపుల్‌. ఘటన జరిగిన వెంటనే అతని సోదరుడు జుగ్ను, భార్య రచన కొలంబోకి వెళ్ళి, అక్కడ జునో మృతదేహాన్ని కనుగొన్నారు. జునో మృతదేహాన్ని ఇండియాకి తరలిస్తున్నారు. అల్‌ ఫుత్తైమ్‌ గ్రూప్‌లో ఐటీ మేనేజర్‌ జనరల్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. జునో కుటుంబం ఉత్తర ప్రదేశ్‌ నుంచి వెళ్ళి ఉపాధి నిమిత్తం దుబాయ్‌లో వుంటోంది. 
  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com