శ్రీలంక పేలుళ్ళలో మరో భారతీయ వలసదారుడి మృతి
- April 25, 2019
శ్రీలంకలో ఇటీవల జరిగిన బాంబు పేలుళ్ళలో భారతదేశానికి చెందిన జునో శ్రీవాస్తవ ప్రాణాలు కోల్పోయినట్లు దుబాయ్లోని కాన్సుల్ జనరల్ విపుల్ వెల్లడించారు. జునో శ్రీవాస్తవ, దుబాయ్లో వుంటున్నారు. కొలంబోలోని సినామన్ గ్రాండ్ హోటల్లో జరిగిన పేలుళ్ళలో జునో ప్రాణాలు కోల్పోయినట్లు వివరించారు విపుల్. ఘటన జరిగిన వెంటనే అతని సోదరుడు జుగ్ను, భార్య రచన కొలంబోకి వెళ్ళి, అక్కడ జునో మృతదేహాన్ని కనుగొన్నారు. జునో మృతదేహాన్ని ఇండియాకి తరలిస్తున్నారు. అల్ ఫుత్తైమ్ గ్రూప్లో ఐటీ మేనేజర్ జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నారు. జునో కుటుంబం ఉత్తర ప్రదేశ్ నుంచి వెళ్ళి ఉపాధి నిమిత్తం దుబాయ్లో వుంటోంది.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







