రన్ ఓవర్ యాక్సిడెంట్: డ్రైవర్ అరెస్ట్
- April 26, 2019
షార్జా:షార్జా పోలీసులు ఓ డ్రైవర్ని రన్ ఓవర్ కేసులో అరెస్ట్ చేశారు. షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్డుపై జరిగిన ఓ రోడ్డు ప్రమాదానికి సంబంధించి నిందితుడ్ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే అక్కడినుంచి డ్రైవర్ పారిపోయినట్లు తెలిపిన అధికారులు, ఈ ఘటనలో ఆఫ్రికాకి చెందిన ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయినట్లు వివరించారు. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి పోలీసులు చేరుకుని, బాధితుడ్ని ఆసుపత్రికి తరలించగా, ఆసుపత్రిలో అతను మృతి చెందడం జరిగింది. డ్రైవర్లు వాహనాలు నడిపే సమయంలో అప్రమత్తంగా వుండాలనీ, ప్రమాదాలు జరిగితే అక్కడే వాహనాన్ని ఆపి, బాధితులకు సహాయ చర్యలు అందించాలని షార్జా పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.
తాజా వార్తలు
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- 25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చిన స్నేహితుడు..







