రన్ ఓవర్ యాక్సిడెంట్: డ్రైవర్ అరెస్ట్
- April 26, 2019షార్జా:షార్జా పోలీసులు ఓ డ్రైవర్ని రన్ ఓవర్ కేసులో అరెస్ట్ చేశారు. షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్డుపై జరిగిన ఓ రోడ్డు ప్రమాదానికి సంబంధించి నిందితుడ్ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే అక్కడినుంచి డ్రైవర్ పారిపోయినట్లు తెలిపిన అధికారులు, ఈ ఘటనలో ఆఫ్రికాకి చెందిన ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయినట్లు వివరించారు. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి పోలీసులు చేరుకుని, బాధితుడ్ని ఆసుపత్రికి తరలించగా, ఆసుపత్రిలో అతను మృతి చెందడం జరిగింది. డ్రైవర్లు వాహనాలు నడిపే సమయంలో అప్రమత్తంగా వుండాలనీ, ప్రమాదాలు జరిగితే అక్కడే వాహనాన్ని ఆపి, బాధితులకు సహాయ చర్యలు అందించాలని షార్జా పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!