బుర్జ్ ఖలీఫాకి శ్రీలంక జెండా వెలుగులు
- April 26, 2019
దుబాయ్లోని ప్రముఖ నిర్మాణం బుర్జ్ ఖలీఫా శ్రీలంక జెండా వెలుగులతో దర్శనమిచ్చింది. ప్రపంచంలో శాంతి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, సహనంతో వ్యవహరించాలని ఈ సదర్భంగా బుర్జ్ ఖలీఫా యాజమాన్యం ఆకాంక్షించింది. బుర్జ్ ఖలీఫాతోపాటు అబుదాబీలోని ఐకానిక్ ల్యాండ్ మార్క్స్ శ్రీలంక జాతీయ జెండా వెలుగులతో కనిపించాయి. ఎమిరేట్స్ ప్యాలెస్, షేక్ జాయెద్ బ్రిడ్జి, అడ్నాక్ బిల్డింగ్, క్యాపిటల్ గేట్ కూడా శ్రీలంక రంగులతో నిండిపోయాయి. ఈస్టర్ ఆదివారం పవిత్ర ప్రార్థనలు చేస్తున్న సమయంలో శ్రీలంకలో తీవ్రవాదులు మారణహోమానికి పాల్పడి దాదాపు 400 మంది ప్రాణాలు బలిగొన్న విషయం విదితమే. 500 మందికి పైగా క్షతగాత్రులు తమ ప్రాణాలతో పోరాడుతున్నారు. ఇప్పటికీ పేలుళ్ళ టెన్షన్ శ్రీలంకలో తగ్గలేదు.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







