బుర్జ్ ఖలీఫాకి శ్రీలంక జెండా వెలుగులు
- April 26, 2019
దుబాయ్లోని ప్రముఖ నిర్మాణం బుర్జ్ ఖలీఫా శ్రీలంక జెండా వెలుగులతో దర్శనమిచ్చింది. ప్రపంచంలో శాంతి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, సహనంతో వ్యవహరించాలని ఈ సదర్భంగా బుర్జ్ ఖలీఫా యాజమాన్యం ఆకాంక్షించింది. బుర్జ్ ఖలీఫాతోపాటు అబుదాబీలోని ఐకానిక్ ల్యాండ్ మార్క్స్ శ్రీలంక జాతీయ జెండా వెలుగులతో కనిపించాయి. ఎమిరేట్స్ ప్యాలెస్, షేక్ జాయెద్ బ్రిడ్జి, అడ్నాక్ బిల్డింగ్, క్యాపిటల్ గేట్ కూడా శ్రీలంక రంగులతో నిండిపోయాయి. ఈస్టర్ ఆదివారం పవిత్ర ప్రార్థనలు చేస్తున్న సమయంలో శ్రీలంకలో తీవ్రవాదులు మారణహోమానికి పాల్పడి దాదాపు 400 మంది ప్రాణాలు బలిగొన్న విషయం విదితమే. 500 మందికి పైగా క్షతగాత్రులు తమ ప్రాణాలతో పోరాడుతున్నారు. ఇప్పటికీ పేలుళ్ళ టెన్షన్ శ్రీలంకలో తగ్గలేదు.
తాజా వార్తలు
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- 25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చిన స్నేహితుడు..







