టీచర్ ఉద్యోగం.. జీతం రూ.3 లక్షలు..
- April 26, 2019
కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి.. పడితే పట్టాలిరా యూ.ఏ.ఈ లో టీచర్ ఉద్యోగం.. అవును మరి అక్కడ పంతులమ్మకి రూ.3 లక్షల జీతమట. ఆహా! అదృష్టమంటే వారిది అని అనుకోకండి. మన దేశం నుంచి వెళ్లిన టీచర్లకు కూడా రూ. 3 లక్షలకు పైగానే జీతం ఇచ్చి మరీ తీసుకుంటున్నారు. ఎమిరేట్ గవర్నమెంట్ స్కూల్స్లో పనిచేయడానికి దాదాపు 3,000 మంది టీచర్ల నియామక ప్రక్రియను చేపట్టింది. ఇందుకు సంబంధించిన రాత పరీక్ష, ఇంటర్వ్యూ లాంటివి అన్నీ ముంబై, ఢిల్లీ కేంద్రాల్లో జరుగుతాయి.
ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.3,04,017 జీతం లభించనుంది. మన దేశంలోని టీచర్లు అందుకుంటున్న వేతనంతో పోలిస్తే దాదాపు 10 రెట్లు ఎక్కువ. యూ.ఏ.ఈ వచ్చి ఉద్యోగం చేసే అభ్యర్థుల కోసం మరిన్ని సదుపాయాలు కల్పించడానికి సిద్ధమవుతోంది గవర్నమెంట్. ఎంపికైన అభ్యర్థుల కుటుంబాల కోసం కొత్త వీసా నిబంధనలను తీసుకురావలనుకుంటోంది. యూ.ఏ.ఈ లో ప్రైవేట్ స్కూళ్లతో సరిసమానంగా ప్రభుత్వ స్కూళ్లు సరైన విద్యను అందించలేకపోతున్నాయట. అందుకే పరిస్థితిని చక్కదిద్దేందుకు కసరత్తు ప్రారంభించింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు, ప్రైవేట్ స్కూల్ విద్యార్థులకు ఏ మాత్రం తీసిపోని విధంగా విద్యార్థులను తయారు చేయాలనుకుంటోంది. ఈ మేరకు టీచర్ల నియామక ప్రక్రియను చేపట్టింది.
తాజా వార్తలు
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- 25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చిన స్నేహితుడు..
- భారత్, న్యూజిలాండ్ ల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం
- పవన్ కల్యాణ్కు సర్జరీ సక్సెస్..త్వరగా కోలుకోవాలన్న సీఎం చంద్రబాబు!
- వేసవి రద్దీకి దుబాయ్ ఎయిర్పోర్ట్స్ సిద్ధం..
- మల్కాజ్గిరి భద్రత, పరిశుభ్రత పై పోలీస్–మున్సిపల్ శాఖల సమన్వయ సమావేశం
- షార్జాలో పర్యాటక రంగానికి భారీ ఊరట..!!
- ఇంట్లోనే అక్రమంగా రెస్టారెంట్..పలు ఉల్లంఘనలు నమోదు..!!
- ఒమన్–భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం.. సముద్ర భద్రతపై కీలక చర్చలు..!!







