ఏపీ, ఒడిషాలను వణుకుపుట్టించిన ఫోని.. బెంగాల్ వైపుగా..
- May 03, 2019ఏపీ, ఒడిషాలను వణుకుపుట్టించిన ఫోని.. పదిన్నర గంటల సమయంలో పూరీ సమీపంలో తీరం దాటింది. తీరం దాటిన సమయంలో గంటకు 180 కిలో మీటర్ల నుంచి 200 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. దీంతో పూరీ తీరం అల్లకల్లోలంగా మారింది. అలలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. ఆర్టీజీఎస్ అంచనాలకు అనుగుణంగానే ఫోని పూరీ తీరం దాటింది. ప్రస్తుతం తుఫాన్ బెంగాల్వైపుగా పయనిస్తోంది. మేఘాలయ వరకు కొనసాగి అనంతరం ఫోని బలహీన పడుతుందని భారత వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
తుఫాన్ పూరీ తీరం దాటడడంతో ఉత్తరాంధ్ర వాసులు ఊపిరి పీల్చుకున్నారు. అంతకు ముందు ఉత్తరాంధ్ర మీదుగా తుఫాన్ పయనించడంతో శ్రీకాకుళం జిల్లాలో ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. చెట్లు నేలకూలాయి. స్తంభాలు విరిగిపడ్డాయి. తీర ప్రాంతాల్లోని ఇంటిపై కప్పులు ఎగిరిపోయాయి. గాలుల ధాటికి జిల్లాలో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇక తీరంలో ఉన్న మత్స్యకారుల పడవలు కూడా బలమైన గాలులకు దెబ్బతిన్నాయి. అటు ఒడిషాలోనూ ఫోని తీవ్ర నష్టాన్ని మిగిల్చింది.
ఏపీ ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు చర్యలు చేపట్టడంతో ఆస్తి, ప్రాణనష్టం భారీగా తప్పింది. ముందు జాగ్రత్తగా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి.. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో ఎలాంటి ముప్పు వాటిల్లలేదు. మరోవైపు రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలను ముమ్మరం చేశారు. రహదారులపై విరిగిపడ్డ చెట్లను తొలగించి రాకపోకలను క్లియర్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కల్యాణ్ నామినేషన్
- గాజాలో తక్షణ కాల్పుల విరమణకు GCC, EU ఉమ్మడి చర్యలు. !
- బ్యాంకులు రుణ వాయిదాలు 6 నెలల పాటు వాయిదా..!
- 3 నెలల్లో 67 హాస్పిటాలిటీ సౌకర్యాలు మూసివేత
- జిలీబ్ అల్-షుయౌఖ్లో ఆసియా జాతీయుడి హత్య..!
- యూఏఈ అధ్యక్షుడితో సుల్తాన్ కీలక చర్చలు
- విమానాల్లో 12 ఏళ్లలోపు చిన్నారులకు వారి పేరెంట్స్ పక్కనే సీటు ఇవ్వాలి: DGCA
- బాధిత కుటుంబాల కోసం వాట్సాప్ నంబర్ ప్రారంభం
- కొండగట్టు అంజన్న ఆలయంలో భక్తుల కిటకిట
- విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ వ్యతిరేకం: సీఎం జగన్