ఏపీ, ఒడిషాలను వణుకుపుట్టించిన ఫోని.. బెంగాల్ వైపుగా..
- May 03, 2019
ఏపీ, ఒడిషాలను వణుకుపుట్టించిన ఫోని.. పదిన్నర గంటల సమయంలో పూరీ సమీపంలో తీరం దాటింది. తీరం దాటిన సమయంలో గంటకు 180 కిలో మీటర్ల నుంచి 200 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. దీంతో పూరీ తీరం అల్లకల్లోలంగా మారింది. అలలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. ఆర్టీజీఎస్ అంచనాలకు అనుగుణంగానే ఫోని పూరీ తీరం దాటింది. ప్రస్తుతం తుఫాన్ బెంగాల్వైపుగా పయనిస్తోంది. మేఘాలయ వరకు కొనసాగి అనంతరం ఫోని బలహీన పడుతుందని భారత వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
తుఫాన్ పూరీ తీరం దాటడడంతో ఉత్తరాంధ్ర వాసులు ఊపిరి పీల్చుకున్నారు. అంతకు ముందు ఉత్తరాంధ్ర మీదుగా తుఫాన్ పయనించడంతో శ్రీకాకుళం జిల్లాలో ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. చెట్లు నేలకూలాయి. స్తంభాలు విరిగిపడ్డాయి. తీర ప్రాంతాల్లోని ఇంటిపై కప్పులు ఎగిరిపోయాయి. గాలుల ధాటికి జిల్లాలో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇక తీరంలో ఉన్న మత్స్యకారుల పడవలు కూడా బలమైన గాలులకు దెబ్బతిన్నాయి. అటు ఒడిషాలోనూ ఫోని తీవ్ర నష్టాన్ని మిగిల్చింది.
ఏపీ ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు చర్యలు చేపట్టడంతో ఆస్తి, ప్రాణనష్టం భారీగా తప్పింది. ముందు జాగ్రత్తగా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి.. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో ఎలాంటి ముప్పు వాటిల్లలేదు. మరోవైపు రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలను ముమ్మరం చేశారు. రహదారులపై విరిగిపడ్డ చెట్లను తొలగించి రాకపోకలను క్లియర్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







