ఉద్యోగులకు ఎయిర్‌ ఇండియా వార్నింగ్‌

- May 03, 2019 , by Maagulf
ఉద్యోగులకు ఎయిర్‌ ఇండియా వార్నింగ్‌

మీడియాతో మాట్లాడకూడదని ఎయిర్‌ ఇండియా సంస్థ ఉద్యోగులను హెచ్చరించింది. కొంతమంది ఉద్యోగులు తమ సంస్థ యూనిఫామ్‌ ధరించి సంస్థకు వ్యతిరేకంగా మాట్లాడుతుండటంతో పాటు సోషల్‌ మీడియాలో చెడుగా వీడియోలు పెడుతున్నట్లు ఎయిర్‌ ఇండియా యాజమాన్యం గుర్తించింది. ఈ నేపథ్యంలో.. ఎయిర్‌ ఇండియా సంస్థలో పని చేసే ఉద్యోగులెవ్వరూ మీడియాతో మాట్లాడకూడదని ఉద్యోగులకు వార్నింగ్‌ ఇచ్చింది. సంస్థకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా కఠిన చర్యలు తీసుకుంటామని, ఇలాంటి వాటికి ఉద్యోగులు దూరంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com