వలసవాసులకు 'డిఎన్ఎ టెస్ట్' ట్రంప్ ప్రభుత్వం నిర్ణయం
- May 03, 2019
దేశంలోకి పెరుగుతున్న వలసలను నిరోధించేందుకు వీలుగా వలసవాసుల కుటుంబ సంబంధాలను నిర్ధారించేందుకు వారికి సత్వర (రాపిడ్) డిఎన్ఎ పరీక్షలు నిర్వహించాలని అమెరికా సరిహద్దు భద్రతా విభాగం అధికారులు నిర్ణయించారు. తల్లితండ్రులతో చిన్నారుల రక్త సంబంధాన్ని నిర్ధారించుకునేందుకు వలస వాసులకు సత్వర డిఎన్ఎ పరీక్షలు నిర్వహించనున్నట్లు హోంశాఖ అధికారులు వెల్లడించారు. ఈ పరీక్షల ప్రక్రియను ఇప్పటికే అమెరికా-మెక్సికో సరిహద్దుల్లో ప్రారంభించామని చెప్పారు. ఈ ప్రాంతంలోనే ప్రతి నెలా ఎక్కువ మంది అక్రమ వలసదారులు సరిహద్దులను దాటి అమెరికాలో ఆశ్రయాన్ని కోరుతుంటారని వారు వివరించారు. కొంతమంది వ్యక్తులు తమకు సంబంధం లేని చిన్నారులను వెంట తీసుకుని అమెరికాలో స్థిరపడేందుకు ప్రయత్నిస్తుంటారని, వారిని నిరోధించేందుకే ఈ పరీక్షలు చేపట్టామని అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









