వలసవాసులకు 'డిఎన్ఎ టెస్ట్' ట్రంప్ ప్రభుత్వం నిర్ణయం
- May 03, 2019
దేశంలోకి పెరుగుతున్న వలసలను నిరోధించేందుకు వీలుగా వలసవాసుల కుటుంబ సంబంధాలను నిర్ధారించేందుకు వారికి సత్వర (రాపిడ్) డిఎన్ఎ పరీక్షలు నిర్వహించాలని అమెరికా సరిహద్దు భద్రతా విభాగం అధికారులు నిర్ణయించారు. తల్లితండ్రులతో చిన్నారుల రక్త సంబంధాన్ని నిర్ధారించుకునేందుకు వలస వాసులకు సత్వర డిఎన్ఎ పరీక్షలు నిర్వహించనున్నట్లు హోంశాఖ అధికారులు వెల్లడించారు. ఈ పరీక్షల ప్రక్రియను ఇప్పటికే అమెరికా-మెక్సికో సరిహద్దుల్లో ప్రారంభించామని చెప్పారు. ఈ ప్రాంతంలోనే ప్రతి నెలా ఎక్కువ మంది అక్రమ వలసదారులు సరిహద్దులను దాటి అమెరికాలో ఆశ్రయాన్ని కోరుతుంటారని వారు వివరించారు. కొంతమంది వ్యక్తులు తమకు సంబంధం లేని చిన్నారులను వెంట తీసుకుని అమెరికాలో స్థిరపడేందుకు ప్రయత్నిస్తుంటారని, వారిని నిరోధించేందుకే ఈ పరీక్షలు చేపట్టామని అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- డౌన్టౌన్ దుబాయ్లో పేలుళ్ల వార్తలు అవాస్తవం..
- తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పనితీరుపై సమగ్ర సమీక్ష: డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. నలుగురు మృతి..
- జపాన్ ఓపెన్ లో క్వార్టర్స్కు దూసుకెళ్లిన పీవీ సింధు!
- పూరీ రథయాత్రలో తొక్కిసలాట.. ఒకరు మృతి
- ‘జగన్ 2.0 సూపర్ యాప్’ ఆవిష్కరణ
- అరేబియా టాప్-100 సీఈఓల జాబితాలో 8 మంది కువైటీలు..!!
- నకిలీ ట్రావెల్ ఆఫర్లు, AI స్కామ్లపై యూఏఈ అలెర్ట్..!!
- మత విద్వేష వ్యాఖ్యలు.. మహిళకు నెల రోజుల జైలు శిక్ష..!!
- బెలారస్లో ఒమన్ రాజవంశ సంపద ప్రదర్శన ప్రారంభం..!!







