వలసవాసులకు 'డిఎన్ఎ టెస్ట్' ట్రంప్ ప్రభుత్వం నిర్ణయం
- May 03, 2019
దేశంలోకి పెరుగుతున్న వలసలను నిరోధించేందుకు వీలుగా వలసవాసుల కుటుంబ సంబంధాలను నిర్ధారించేందుకు వారికి సత్వర (రాపిడ్) డిఎన్ఎ పరీక్షలు నిర్వహించాలని అమెరికా సరిహద్దు భద్రతా విభాగం అధికారులు నిర్ణయించారు. తల్లితండ్రులతో చిన్నారుల రక్త సంబంధాన్ని నిర్ధారించుకునేందుకు వలస వాసులకు సత్వర డిఎన్ఎ పరీక్షలు నిర్వహించనున్నట్లు హోంశాఖ అధికారులు వెల్లడించారు. ఈ పరీక్షల ప్రక్రియను ఇప్పటికే అమెరికా-మెక్సికో సరిహద్దుల్లో ప్రారంభించామని చెప్పారు. ఈ ప్రాంతంలోనే ప్రతి నెలా ఎక్కువ మంది అక్రమ వలసదారులు సరిహద్దులను దాటి అమెరికాలో ఆశ్రయాన్ని కోరుతుంటారని వారు వివరించారు. కొంతమంది వ్యక్తులు తమకు సంబంధం లేని చిన్నారులను వెంట తీసుకుని అమెరికాలో స్థిరపడేందుకు ప్రయత్నిస్తుంటారని, వారిని నిరోధించేందుకే ఈ పరీక్షలు చేపట్టామని అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







