రమదాన్‌ నేపథ్యంలో 377 మంది ప్రిజనర్స్‌కి షార్జా రూలర్‌ క్షమాభిక్ష

- May 03, 2019 , by Maagulf
రమదాన్‌ నేపథ్యంలో 377 మంది ప్రిజనర్స్‌కి షార్జా రూలర్‌ క్షమాభిక్ష

సుప్రీం కౌన్సిల్‌ మెంబర్‌, షార్జా రూలర్‌ డాక్టర్‌ షేక్‌ సుల్తాన్‌ బిన్‌ మొహమ్మద్‌ అల్‌ కాసిమి 377 మంది ప్రిజనర్స్‌ విడుదలకు ఆదేశాలు జారీ చేశారు. రమదాన్‌ నేపథ్యంలో ఈ క్షమాభిక్ష అందించినట్లు అధికారులు పేర్కొన్నారు. గుడ్‌ కండక్ట్‌ నేపథ్యంలో ఆయా వ్యక్తులకు క్షమాభిక్ష లభిస్తుందని కమాండర్‌ ఇన్‌ చీఫ్‌ - షార్జా పోలీస్‌ మేజర్‌ సైఫ్‌ అల్‌ జెరి, అల్‌ షమ్షి చెప్పారు. ఈ సందర్భంగా షార్జా రూలర్‌కి కృతజ్ఞతలు కూడా తెలిపారాయన. వివిద కారణాలతో జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు, క్షమాభిక్షతో తిరిగి సాధారణ జీవితం గడుపుతారని ఆశిస్తున్నామనీ, సమాజంలో మంచి పౌరులుగా వారు మారతారని ఆశిస్తున్నట్లు తెలిపారు అధికారులు. గత ఏడాది పోల్చితే ఈ ఏడాది క్షమాభిక్ష పొందిన ఖైదీల సంఖ్య ఎక్కువని అధికారులు అంటున్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com