షార్జా లో డెలివరీ బాయ్ని గదిలోకి లాక్కెళ్లి…
- May 03, 2019
షార్జా:ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వచ్చిన డెరివరీ బాయ్పై యువతులు కలిసి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన షార్జాలో జరిగింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో భాగమైన షార్జా నగరం ఓ అపార్ట్ మెంటులోని ఓ ఫ్లాట్ లో ఉంటున్న యువతులు ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ ఇచ్చారు. దాంతో ఫుడ్ డెలివరీ చేయడానికి ఆ ఫ్లాట్కు డెలివరీ బాయ్ వెళ్ళాడు. ఓ యువతి వచ్చి తాను ఆర్డర్ చేసిన ఫుడ్ని తమ గదిలోకి తీసుకెళ్లింది. అయితే ఎంతసేపటికి డెలివరీ బేకు డబ్బులు ఇబ్బకుండా అతన్ని బయటే ఉంచింది. దాంతో ఆమె ఎంత సేపటికి బయటికి రాకపోవడంతో డెలివరి బాయ్ బెల్ కొట్టి లోపలి వెళ్ళాడు. ఫుడ్ ఆర్డర్ తాలూకు Dh200బిల్లును చెల్లించమని అడిగాడు. అనుమతి లేకుండా ఇంట్లోకి రావడాన్ని తప్పుబట్టిన ఆ యువతి అతనికి డబ్బులు ఇవ్వలేదు.
ఇదే సమయంలో గదిలోపడి నుండి అనేక మంది యువతులు వచ్చి ఆ డెలివరీ బాయ్ని బలవంతంగా లోపడికి లాక్కెళ్లారు. అనంతరం గదిలో ఉన్న లైట్లు అన్ని ఆపేసి డెలివరీ బాయ్ పై కత్తితో దాడి చేశారు. అంతేకాకుండా అతని దగ్గర ఉన్న ఫోన్, జేబులో ఉన్న డబ్బులు కూడా లాక్కున్నారు. అయితే వారి భారీ నుంచి ఎలాగోలా తప్పించుకున్న డెలివరీ బాయ్ నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దాడి చేసిన యువతులను అరెస్ట్ చేశారు. బాధితుడి దగ్గరి నుండి లాక్కున్న ఫోన్, డబ్బు తిరిగి ఇచ్చేస్తానంటూ యువతులు పోలీసులకు తెలిపారు. కాగా ఈ కేసు విచారణ మే 20కి వాయిదా పడింది.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







