రూ.15వేలు మింగేసిన కుక్క..
- May 04, 2019
యూకే:యజమాని పెడితే నాలుగు మాంసం ముక్కలు పరపరా తినేస్తాయి శునకాలు. వాసన చూడకుండా ఏది పెడితే అది తినేయదు. ఆఖరికి పెరుగన్న పెట్టినా అందులో చిటికెడు ఉప్పేస్తేనే కాని ముట్టదు. వాటికిష్టమైన బిస్కెట్లు సరేసరి. మరి అలాంటిది యూకేలోని ఉజ్జీ అనే ఓ శునకం వయసు తొమ్మిదేళ్లు. ఇది ఏకంగా 160 పౌండ్లు తినేసింది. ఆకలేసిందో లేదా డిఫరెంట్గా ట్రై చేయాలనుకుందో ఏమో కాని.. అవి తిని హాస్పిటల్ పాలైంది. యజమాని చెప్పినట్లు చేస్తూ ఆయన అభిమానాన్ని చూరగొంది ఉజ్జీ. లెటర్స్ వచ్చినా రాకపోయిన గేటుకి వుంచిన బాక్స్ ఓపెన్ చేసి చూడడం దానికి అలవాటు చేశారు యజమాని. దాంతో రోజూ అది వెళ్లి చూసేది.
ఏమైనా ఉంటే తీసుకువచ్చి యజమానికి ఇచ్చేది. ఈ క్రమంలో ఇంట్లో టేబుల్ మీద పెట్టిన పర్సు కనిపించకుండా పోయింది. ఇల్లంతా వెతికినా ఎక్కడా కనపడలేదు. ఏమై ఉంటుందో యజమానికి అంతుబట్టలేదు. మరోసారి ఓ కవర్లో ఉంచిన రూ.15,000లను యజమాని చూస్తుండగానే నమిలి మింగేసింది. అప్పుడు కానీ ఆయనకి అర్థం కాలేదు. పర్సుని కూడా ఇదే స్వాహా చేసి ఉంటుందని. డబ్బులు పోతే పొయ్యాయి. అవి మింగినందుకు దీనికి ఏమైనా అయితే.. అని గబగబా హాస్పిటల్కి పరిగెట్టాడు ఉజ్జీని తీసుకుని. డాక్టర్లు పరీక్షించి దానికడుపులో కవర్తో పాటు, పర్సు ఉన్నట్లు తెలుసుకున్నారు. శునకం కడుపులో నుంచి ఆ కరెన్సీ ముక్కలను తీయడానికి పట్టిన ఖర్చు మొత్తం ఎంతనుకున్నారు.. అక్షరాలా రూ.11 వేలు. అది నమిలి మింగిన నోట్ల విలువ.
తాజా వార్తలు
- ఆర్థిక, పెట్టుబడి సహకారంపై బహ్రెయిన్–ఫ్రాన్స్ చర్చలు..!!
- సౌదీలో 2025 సుజుకి గ్రాండ్ విటారా కార్లు రీకాల్..!!
- భారతీయ నావికులను పరామర్శించిన దుబాయ్ భారత కాన్సులేట్ అధికారులు..!!
- కువైట్ సహా నాలుగు దేశాల్లో భారత కాన్సులర్ సేవలపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు.!!
- దుబాయ్లో కొత్త రికార్డు.. ఎమిరేట్స్ హిల్స్లో విల్లాకు Dh17 మిలియన్ల అద్దె..!!
- ఖతార్లో తీవ్రమైన ఎండలు, తేమ.. వాతావరణ శాఖ వెల్లడి..!!
- నగరవాసులకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- భారత్ టెక్స్–2026లో ఆంధ్రప్రదేశ్కు రూ.4,100 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







