గవర్నమెంట్ స్కూల్స్కి రమదాన్ టైమింగ్స్
- May 04, 2019
కతార్:మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ మరియు హయ్యర్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ స్కూల్స్కి పవిత్ర రమదాన్ మాసం నేపథ్యంలో సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. ఈ సర్క్యులర్ ద్వారా ఆయా స్కూళ్ళ సమయాల్ని స్పష్టంగా పేర్కొన్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలవరకు మాత్రమే కిండర్గార్టెన్ స్కూల్స్ పనిచేయాల్సి వుంటుంది. గ్రేడ్ 1 నుంచి 12 వరకు విద్యార్థులకు మాత్రం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు స్కూల్స్ వుంటాయి. స్కూల్స్కి ఐదు పీరియడ్స్, అందులో ఒక్కో పీరియడ్కి 40 నిమిషాలు కేటాయించాలి. అసెంబ్లీ 9 గంటల నుంచి 9.10 గంటల వరకు మాత్రమే వుంటుంది. 11.20 నిమిషాల నుంచి 11.40 నిమిషాల వరకు ఇరవై నిమిషాల పాటు బ్రేక్ వుంటుంది. నాలుగో పీరియడ్ 11.40 నుంచి 12.20 వరకు, ఆఖరి పీరియడ్ 12.20 నుంచి 1 గంట వరకు వుండాలి.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







