రూ.15వేలు మింగేసిన కుక్క..
- May 04, 2019యూకే:యజమాని పెడితే నాలుగు మాంసం ముక్కలు పరపరా తినేస్తాయి శునకాలు. వాసన చూడకుండా ఏది పెడితే అది తినేయదు. ఆఖరికి పెరుగన్న పెట్టినా అందులో చిటికెడు ఉప్పేస్తేనే కాని ముట్టదు. వాటికిష్టమైన బిస్కెట్లు సరేసరి. మరి అలాంటిది యూకేలోని ఉజ్జీ అనే ఓ శునకం వయసు తొమ్మిదేళ్లు. ఇది ఏకంగా 160 పౌండ్లు తినేసింది. ఆకలేసిందో లేదా డిఫరెంట్గా ట్రై చేయాలనుకుందో ఏమో కాని.. అవి తిని హాస్పిటల్ పాలైంది. యజమాని చెప్పినట్లు చేస్తూ ఆయన అభిమానాన్ని చూరగొంది ఉజ్జీ. లెటర్స్ వచ్చినా రాకపోయిన గేటుకి వుంచిన బాక్స్ ఓపెన్ చేసి చూడడం దానికి అలవాటు చేశారు యజమాని. దాంతో రోజూ అది వెళ్లి చూసేది.
ఏమైనా ఉంటే తీసుకువచ్చి యజమానికి ఇచ్చేది. ఈ క్రమంలో ఇంట్లో టేబుల్ మీద పెట్టిన పర్సు కనిపించకుండా పోయింది. ఇల్లంతా వెతికినా ఎక్కడా కనపడలేదు. ఏమై ఉంటుందో యజమానికి అంతుబట్టలేదు. మరోసారి ఓ కవర్లో ఉంచిన రూ.15,000లను యజమాని చూస్తుండగానే నమిలి మింగేసింది. అప్పుడు కానీ ఆయనకి అర్థం కాలేదు. పర్సుని కూడా ఇదే స్వాహా చేసి ఉంటుందని. డబ్బులు పోతే పొయ్యాయి. అవి మింగినందుకు దీనికి ఏమైనా అయితే.. అని గబగబా హాస్పిటల్కి పరిగెట్టాడు ఉజ్జీని తీసుకుని. డాక్టర్లు పరీక్షించి దానికడుపులో కవర్తో పాటు, పర్సు ఉన్నట్లు తెలుసుకున్నారు. శునకం కడుపులో నుంచి ఆ కరెన్సీ ముక్కలను తీయడానికి పట్టిన ఖర్చు మొత్తం ఎంతనుకున్నారు.. అక్షరాలా రూ.11 వేలు. అది నమిలి మింగిన నోట్ల విలువ.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు