587 మంది ఖైదీలకు క్షమాభిక్ష

- May 04, 2019 , by Maagulf
587 మంది ఖైదీలకు క్షమాభిక్ష

యూఏఈ ప్రైమ్‌ మినిస్టర్‌, వైస్‌ ప్రెసిడెంట్‌, దుబాయ్‌ రూలర్‌ షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తౌమ్‌ 587 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రకటించారు. ఈ 587 మందిలో వివిధ దేశాలకు చెందినవారున్నారు. పవిత్ర రమదాన్‌ మాసం నేపథ్యంలో ఈ క్షమాభిక్ష ఇవ్వడం జరిగిందని అధికారులు వివరించారు. దుబాయ్‌ అటార్నీ జనరల్‌ ఛాన్సెలర్‌ ఇస్సామ్‌ ఇస్సా అల్‌ హుమైదన్‌ మాట్లాడుతూ, క్షమాభిక్షతో ఆయా వ్యక్తుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తుందనీ, క్షమాభిక్ష పొందినవారు కొత్త జీవితాన్ని ప్రారంభించాల్సి వుంటుందని ఆకాంక్షించారు. క్షమాభిక్షకు సంబంధించి చట్ట పరమైన చర్యల్ని పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌ ఇప్పటికే ప్రారంభించిందని ఆయన తెలిపారు. షేక్‌ ఖలీఫా బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌ గతంలో 3,005 మంది ఖైదీల విడుదలకు మార్గం సుగమం చేసిన విషయం విదితమే. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com