ఇండియా:రైలు ప్రయాణికులకు శుభవార్త
- May 05, 2019
ప్రయాణికుకులకు శుభవార్త చెప్పింది రైల్వే శాఖ. ప్రయాణికులు తమ బోర్డింగ్ స్టేషన్ను మార్చుకునే సౌలభ్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది ఐఆర్సీటీసీ. ఎవరైనా రిజర్వేషన్ చేయించుకున్న తర్వాత ఎక్కే స్టేషన్ మార్చుకోవాలంటూ కనీసం 24 గంటల సమయం పడుతోంది. బోర్డింగ్ స్టేషన్లో ప్రయాణికులు రైలు ఎక్కకుంటే రిజర్వేషన్ క్యాన్సిల్ అవుతోంది. దీనివలన ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎవరైనా ప్రయాణికులు ముందుగా రిజర్వేషన్ చేసుకున్న తరువాత బోర్డింగ్ స్టేషన్ లో కాకుండా మరోచోట ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు బోర్డింగ్ స్టేషన్ మరోచోటుకి మార్చుకోవచ్చు.
ఇది ఆన్ లైన్ లో టిక్కెట్ బుకింగ్ చేసుకున్న వారికి మాత్రమే అందుబాటులో వుంది. బుకింగ్ కౌంటర్ లో టిక్కెట్ బుకింగ్ చేసుకున్న వారికి మాత్రం ఈ సౌలభ్యం అందుబాటులో లేదు. ఇందుకోసం ఐఆర్సీటీసీ లో వెబ్ సైట్లో ఐడీ పాస్ వార్డ్ లాగిన్ అయ్యి …. బుకింగ్ టికెట్ హిస్టరీలోకి వెళ్ళాలి. రైలును ఎంచుకొని బోర్డింగ్ పాయింట్ మార్చుకోవచ్చు. స్టేషన్ మార్చుకునే ప్రయాణికులకు, రెండు స్టేషన్లకూ మధ్య ఉన్న దూరానికి రైలు ఛార్జీ వెనక్కి రాదని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







