ఇండియా:రైలు ప్రయాణికులకు శుభవార్త
- May 05, 2019
ప్రయాణికుకులకు శుభవార్త చెప్పింది రైల్వే శాఖ. ప్రయాణికులు తమ బోర్డింగ్ స్టేషన్ను మార్చుకునే సౌలభ్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది ఐఆర్సీటీసీ. ఎవరైనా రిజర్వేషన్ చేయించుకున్న తర్వాత ఎక్కే స్టేషన్ మార్చుకోవాలంటూ కనీసం 24 గంటల సమయం పడుతోంది. బోర్డింగ్ స్టేషన్లో ప్రయాణికులు రైలు ఎక్కకుంటే రిజర్వేషన్ క్యాన్సిల్ అవుతోంది. దీనివలన ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎవరైనా ప్రయాణికులు ముందుగా రిజర్వేషన్ చేసుకున్న తరువాత బోర్డింగ్ స్టేషన్ లో కాకుండా మరోచోట ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు బోర్డింగ్ స్టేషన్ మరోచోటుకి మార్చుకోవచ్చు.
ఇది ఆన్ లైన్ లో టిక్కెట్ బుకింగ్ చేసుకున్న వారికి మాత్రమే అందుబాటులో వుంది. బుకింగ్ కౌంటర్ లో టిక్కెట్ బుకింగ్ చేసుకున్న వారికి మాత్రం ఈ సౌలభ్యం అందుబాటులో లేదు. ఇందుకోసం ఐఆర్సీటీసీ లో వెబ్ సైట్లో ఐడీ పాస్ వార్డ్ లాగిన్ అయ్యి …. బుకింగ్ టికెట్ హిస్టరీలోకి వెళ్ళాలి. రైలును ఎంచుకొని బోర్డింగ్ పాయింట్ మార్చుకోవచ్చు. స్టేషన్ మార్చుకునే ప్రయాణికులకు, రెండు స్టేషన్లకూ మధ్య ఉన్న దూరానికి రైలు ఛార్జీ వెనక్కి రాదని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







