ఇండియా:రైలు ప్రయాణికులకు శుభవార్త
- May 05, 2019ప్రయాణికుకులకు శుభవార్త చెప్పింది రైల్వే శాఖ. ప్రయాణికులు తమ బోర్డింగ్ స్టేషన్ను మార్చుకునే సౌలభ్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది ఐఆర్సీటీసీ. ఎవరైనా రిజర్వేషన్ చేయించుకున్న తర్వాత ఎక్కే స్టేషన్ మార్చుకోవాలంటూ కనీసం 24 గంటల సమయం పడుతోంది. బోర్డింగ్ స్టేషన్లో ప్రయాణికులు రైలు ఎక్కకుంటే రిజర్వేషన్ క్యాన్సిల్ అవుతోంది. దీనివలన ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎవరైనా ప్రయాణికులు ముందుగా రిజర్వేషన్ చేసుకున్న తరువాత బోర్డింగ్ స్టేషన్ లో కాకుండా మరోచోట ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు బోర్డింగ్ స్టేషన్ మరోచోటుకి మార్చుకోవచ్చు.
ఇది ఆన్ లైన్ లో టిక్కెట్ బుకింగ్ చేసుకున్న వారికి మాత్రమే అందుబాటులో వుంది. బుకింగ్ కౌంటర్ లో టిక్కెట్ బుకింగ్ చేసుకున్న వారికి మాత్రం ఈ సౌలభ్యం అందుబాటులో లేదు. ఇందుకోసం ఐఆర్సీటీసీ లో వెబ్ సైట్లో ఐడీ పాస్ వార్డ్ లాగిన్ అయ్యి …. బుకింగ్ టికెట్ హిస్టరీలోకి వెళ్ళాలి. రైలును ఎంచుకొని బోర్డింగ్ పాయింట్ మార్చుకోవచ్చు. స్టేషన్ మార్చుకునే ప్రయాణికులకు, రెండు స్టేషన్లకూ మధ్య ఉన్న దూరానికి రైలు ఛార్జీ వెనక్కి రాదని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఆరో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
- ఏపీలో ఎన్నికల పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- యూఏఈలో వడగళ్ల వాన..నివాసితుల ఆందోళన..!
- దుబాయ్ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు అల్ మక్తూమ్కు బదిలీ..!
- అబుధాబిలో పెరియర్ వాటర్ సురక్షితమా?
- సౌదీ ప్రతినిధి బృందంతో సుప్రీంకోర్టు ఛైర్మన్ సమావేశం
- సౌదీ సివిల్ సర్వెంట్స్ కు కొత్త డ్రెస్ కోడ్..!
- నర్సింగ్ సిబ్బందికి స్పెషల్ అలవెన్స్
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం