ఇజ్రాయెల్: దాడులతో తగలబడుతున్న గాజాస్ట్రిప్
- May 05, 2019
గాజా స్ట్రిప్లో ఇజ్రాయెల్ నుంచి వచ్చి పడిన బాంబులకు ధ్వంసమవుతున్న భవనాలు
ఒకవైపు ఇజ్రాయెల్ దళాలు, మరోవైపు గాజా స్ట్రిప్లో తీవ్రవాదులు పరస్పర దాడులను తీవ్రం చేశారు. ఇరు పక్షాల మధ్య ఇటీవలి కాలంలో అత్యంత తీవ్ర దాడుల్లో ఇది ఒకటి.
పాలస్తీనా మిలిటెంట్లు శనివారం నుంచి ఇజ్రాయెల్ ప్రాంతంలోకి 430 పైగా రాకెట్లను పేల్చారు. వాటిలో అత్యధిక రాకెట్లను మధ్యలోనే అడ్డుకున్నామని, అయినప్పటికీ ఒక వ్యక్తి చనిపోయాడని ఇజ్రాయెల్ పేర్కొంది.
రాకెట్ దాడులకు ప్రతిగా ఈ వారాంతంలో గాజా స్ట్రిప్లోని సుమారు 200 లక్ష్యాలపై దాడులు చేశామని ఇజ్రాయెల్ రక్షణ దళాలు (ఐడీఎఫ్) తెలిపాయి.
ఆ దాడుల్లో నలుగురు వ్యక్తులు చనిపోయారని పాలస్తీనియన్లు చెప్పారు.
ఇరు పక్షాలు గత నెలలో సంధికి అంగీకరించినప్పటికీ ఈ ఘర్షణ చెలరేగటం గమనార్హం. దీర్ఘకాలిక కాల్పుల విరమణకు ఇరు పక్షాలనూ ఒప్పించాలని ఈజిప్ట్, ఐక్యరాజ్యసమితులు కొంత కాలంగా ప్రయత్నిస్తున్నాయి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..