ఇజ్రాయెల్: దాడులతో తగలబడుతున్న గాజాస్ట్రిప్
- May 05, 2019
గాజా స్ట్రిప్లో ఇజ్రాయెల్ నుంచి వచ్చి పడిన బాంబులకు ధ్వంసమవుతున్న భవనాలు
ఒకవైపు ఇజ్రాయెల్ దళాలు, మరోవైపు గాజా స్ట్రిప్లో తీవ్రవాదులు పరస్పర దాడులను తీవ్రం చేశారు. ఇరు పక్షాల మధ్య ఇటీవలి కాలంలో అత్యంత తీవ్ర దాడుల్లో ఇది ఒకటి.
పాలస్తీనా మిలిటెంట్లు శనివారం నుంచి ఇజ్రాయెల్ ప్రాంతంలోకి 430 పైగా రాకెట్లను పేల్చారు. వాటిలో అత్యధిక రాకెట్లను మధ్యలోనే అడ్డుకున్నామని, అయినప్పటికీ ఒక వ్యక్తి చనిపోయాడని ఇజ్రాయెల్ పేర్కొంది.
రాకెట్ దాడులకు ప్రతిగా ఈ వారాంతంలో గాజా స్ట్రిప్లోని సుమారు 200 లక్ష్యాలపై దాడులు చేశామని ఇజ్రాయెల్ రక్షణ దళాలు (ఐడీఎఫ్) తెలిపాయి.
ఆ దాడుల్లో నలుగురు వ్యక్తులు చనిపోయారని పాలస్తీనియన్లు చెప్పారు.
ఇరు పక్షాలు గత నెలలో సంధికి అంగీకరించినప్పటికీ ఈ ఘర్షణ చెలరేగటం గమనార్హం. దీర్ఘకాలిక కాల్పుల విరమణకు ఇరు పక్షాలనూ ఒప్పించాలని ఈజిప్ట్, ఐక్యరాజ్యసమితులు కొంత కాలంగా ప్రయత్నిస్తున్నాయి.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







