ఇజ్రాయెల్: దాడులతో తగలబడుతున్న గాజాస్ట్రిప్
- May 05, 2019
గాజా స్ట్రిప్లో ఇజ్రాయెల్ నుంచి వచ్చి పడిన బాంబులకు ధ్వంసమవుతున్న భవనాలు
ఒకవైపు ఇజ్రాయెల్ దళాలు, మరోవైపు గాజా స్ట్రిప్లో తీవ్రవాదులు పరస్పర దాడులను తీవ్రం చేశారు. ఇరు పక్షాల మధ్య ఇటీవలి కాలంలో అత్యంత తీవ్ర దాడుల్లో ఇది ఒకటి.
పాలస్తీనా మిలిటెంట్లు శనివారం నుంచి ఇజ్రాయెల్ ప్రాంతంలోకి 430 పైగా రాకెట్లను పేల్చారు. వాటిలో అత్యధిక రాకెట్లను మధ్యలోనే అడ్డుకున్నామని, అయినప్పటికీ ఒక వ్యక్తి చనిపోయాడని ఇజ్రాయెల్ పేర్కొంది.
రాకెట్ దాడులకు ప్రతిగా ఈ వారాంతంలో గాజా స్ట్రిప్లోని సుమారు 200 లక్ష్యాలపై దాడులు చేశామని ఇజ్రాయెల్ రక్షణ దళాలు (ఐడీఎఫ్) తెలిపాయి.
ఆ దాడుల్లో నలుగురు వ్యక్తులు చనిపోయారని పాలస్తీనియన్లు చెప్పారు.
ఇరు పక్షాలు గత నెలలో సంధికి అంగీకరించినప్పటికీ ఈ ఘర్షణ చెలరేగటం గమనార్హం. దీర్ఘకాలిక కాల్పుల విరమణకు ఇరు పక్షాలనూ ఒప్పించాలని ఈజిప్ట్, ఐక్యరాజ్యసమితులు కొంత కాలంగా ప్రయత్నిస్తున్నాయి.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







