చైనా ఉత్పత్తులపై 25 శాతం సుంకం పెంచనున్న అమెరికా
- May 06, 2019
వాషింగ్టన్: అమెరికా, చైనాల మధ్య రోజు రోజుకీ వాణిజ్య పోరు ముదిరిపాకాన పడుతుంది. ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నప్పటికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా తీసుకున్న నిర్ణయంతో చైనా ఖంగుతింది. అమెరికాలో 200 బిలియన్ డాలర్ల విలువ చేసే చైనా వస్తువులపై సుంకం 25 శాతం పెంచుతున్నట్లు తేల్చి చెప్పారు. వాణిజ్య పోరుపై చర్చల కోసం బుధవారం నాడు అమెరికాకు చైనా బృందం రానుంది. ఐతే ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఈ సారి చర్చలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
గత 10 నెలలుగా అమెరికాలో చైనా వస్తువులపై డ్రాగన్ కంట్రీ సుంకం కడుతూ వస్తుంది. 50 బిలియన్ డాలర్లు విలువ చేసే వస్తువులపై 25 శాతం సుంకం చెల్లిస్తుండగా, 200 బిలియన్ డాలర్లు విలువ చేసే ఇతర వస్తువులపై 10 శాతం సుంకం చెల్లిస్తుంది చైనా. ఇక ఈ 10 శాతం వచ్చే వారం నుంచి 25 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. చైనాలో అమెరికా ఉత్పత్తులకు అధిక డిమాండు ఉన్నప్పటికి.ట్రంప్ మాత్రం క్షేత్రస్థాయిలో మార్పులు జరగాలని పట్టుబడుతున్నారు. అమెరికా కంపెనీలు తమ టెక్నాలజీని చైనాతో పంచుకోవాలని చైనా పదేపదే అమెరికాపై ఒత్తిడి పెంచడం సరికాదని ట్రంప్ అబిప్రాయపడ్డారు. చైనా విదేశీ సంస్థలపై అవలంబించే విధానాలను ట్రంప్ తప్పుబట్టారు. అందుకే చైనాపై ఒత్తిడి తెచ్చేందకు అమెరికాలోకి ప్రవేశిస్తున్న చైనా ఉత్పత్తులపై ట్రంప్ సుంకం విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. చైనా ఉత్పత్తుల విలువ సుమారుగా 540 బిలియన్ డాలర్లు ఉంటుంది.
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







