నేడు కేరళ వెళ్లనున్న కేసీఆర్
- May 06, 2019
భారత దేశవ్యాప్తంగా నాలుగు విడతల సార్వత్రిక ఎన్నికలు ముగిసాయి. పోలింగ్ సరళిని విశ్లేషించిన తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీలకు అంతంత మాత్రంగానే సీట్లు వస్తాయని భావిస్తున్నారు. ఫలితాల తర్వాత ప్రధాన మంత్రిని నిర్ణయించేది ప్రాంతీయ పార్టీలేనని ఒక అంచనాకు వచ్చిన ఆయన.. ఫెడరల్ ఫ్రంట్పై మరోసారి ఫోకస్ పెట్టారు. అందుకే ఇవాళ కేరళ వెళ్తున్నారు. సాయంత్రం ఆరు గంటలకు త్రివేండ్రంలో సీఎం పినరాయి విజయన్తో సమావేశం కానున్నారు.
పార్టీలు వేరైనా విజయన్తో కేసీఆర్ మంచి సంబంధాలున్నాయి. విజయన్ గతంలో హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయనకు అపూర్వ అతిథ్యం ఇచ్చారు. ఇద్దరు ముఖ్యమంత్రులూ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై చర్చలు కూడా జరిపారు. ఇప్పుడు మరోసారి కేసీఆర్.. త్రివేండం వెళ్లి విజయన్ తో సమావేశం కానున్నారు. దేశరాజకీయాలపై ఆయనతో చర్చించనున్నారు. కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పాటుపై విజయన్ తో మాట్లాడనున్నారు
కేసీఆర్ గతంలో ఫెడరల్ ఫ్రంట్పై వివిధ ప్రాంతీయ పార్టీల నేతలతో సమావేశమయ్యారు. ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్, పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీతో చర్చలు జరిపారు. ఇప్పుడు కేరళ వెళ్లి విజయన్ తో భేటీ కానున్నారు. కేసీఆర్ విజయన్ తో చర్చల తర్వాత రామేశ్వరం, శ్రీరంగం ఆలయాలను సందర్శించనున్నారు.
తాజా వార్తలు
- భారత్ నుంచి బహ్రెయిన్కు BD111 మిలియన్లకు పైగా దిగుమతులు..!!
- హౌతీ బాలిస్టిక్ మిస్సైల్ దాడిని తిప్పికొట్టిన సౌదీ డిఫెన్స్..!!
- ఒమన్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు.. హెచ్చరిక జారీ..!!
- ఎమర్జెన్సీ వార్నింగ్ సిస్టం దుర్వినియోగం..ఇద్దరికి ఆరు నెలల జైలుశిక్ష..!!
- ఫర్వానియా ఫుడ్ హ్యాండ్లర్స్ పరీక్షా కేంద్రం విస్తరణ..!!
- ఖతార్లో వ్యాపార మెరుగుదలకు ప్రైవేట్ కు ప్రోత్సాహం..!!
- వియత్నాం బోటు ప్రమాదం..శంషాబాద్కు చేరిన ఏపీ వాసుల మృతదేహాలు
- హైదరాబాద్ లులు మాల్లో గన్ కలకలం
- హోర్ముజ్ జలసంధిలో క్షిపణి దాడి.. భారత నావికుడి మృతిపై యూఏఈలోని భారత రాయబార కార్యాలయం సంతాపం
- కాళేశ్వరం వివాదం పై కేటీఆర్ ఫైర్..







