తండ్రి ఆత్మహత్య: ప్రత్యేక పరిస్థితుల్లోనూ మంచి మార్కులు సాధించిన విద్యార్థిని
- May 08, 2019
బహ్రెయిన్:పదవ తరగతి విద్యార్థిని శ్రేయ, 2018-19 ఏడాది సీబీఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్స్లో 88 శాతం మార్కులు సంపాదించుకుంది. ఇటీవలే ఆమె తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డారు. శ్రేయ, ఆమె సోదరి బహ్రెయిన్లో విద్యనభ్యసిస్తున్నారు. తాను పనిచేస్తున్న ప్రాంతంలోనే వీరి తండ్రి ఆత్మహత్య చేసుకోవడం అప్పట్లో పెను సంచలనంగా మారింది. శ్రేయ తల్లి ఇండియాలో వున్నారు. శ్రేయ సోదరుడు క్యాన్సర్తో వైద్య చికిత్స పొందుతుండడంతో, తల్లి తన కుమారుడి వద్దనే వుంది. ఇన్ని సమస్యల నడుమ శ్రేయ, బోర్డ్ ఎగ్జామ్స్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తన స్నేహితురాలు గౌరి, ఆమె కుటుంబం ఆర్థిక సహాయం అందించడంతో శ్రేయ, ఆమె సోదరి బహ్రెయిన్లోనే విద్యనభ్యసిస్తున్నారు. ఇండియన్ ఎంబసీ, సోషల్ వర్కర్స్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బహ్రెయిన్ వీరికి అండదండలు అదిస్తున్నాయి.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







