తండ్రి ఆత్మహత్య: ప్రత్యేక పరిస్థితుల్లోనూ మంచి మార్కులు సాధించిన విద్యార్థిని
- May 08, 2019
బహ్రెయిన్:పదవ తరగతి విద్యార్థిని శ్రేయ, 2018-19 ఏడాది సీబీఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్స్లో 88 శాతం మార్కులు సంపాదించుకుంది. ఇటీవలే ఆమె తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డారు. శ్రేయ, ఆమె సోదరి బహ్రెయిన్లో విద్యనభ్యసిస్తున్నారు. తాను పనిచేస్తున్న ప్రాంతంలోనే వీరి తండ్రి ఆత్మహత్య చేసుకోవడం అప్పట్లో పెను సంచలనంగా మారింది. శ్రేయ తల్లి ఇండియాలో వున్నారు. శ్రేయ సోదరుడు క్యాన్సర్తో వైద్య చికిత్స పొందుతుండడంతో, తల్లి తన కుమారుడి వద్దనే వుంది. ఇన్ని సమస్యల నడుమ శ్రేయ, బోర్డ్ ఎగ్జామ్స్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తన స్నేహితురాలు గౌరి, ఆమె కుటుంబం ఆర్థిక సహాయం అందించడంతో శ్రేయ, ఆమె సోదరి బహ్రెయిన్లోనే విద్యనభ్యసిస్తున్నారు. ఇండియన్ ఎంబసీ, సోషల్ వర్కర్స్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బహ్రెయిన్ వీరికి అండదండలు అదిస్తున్నాయి.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









