ఎయిరిండియా బంపరాఫర్

- May 10, 2019 , by Maagulf
ఎయిరిండియా బంపరాఫర్

ప్రయాణీకులకు ఎయిరిండియా శుక్రవారం బంపరాఫర్ ప్రకటించింది. చివరి నిమిషంలో బుక్ చేసుకునే టిక్కెట్లపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఎయిరండియా ప్రధాన కార్యాలయంలో ఈ రోజు జరిగిన వాణిజ్య సమీక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. దేశీయ విమానాల్లో ఈ సదుపాయం అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు తెలిపింది.

ప్రపంచంలోనే టాప్ 10 విమానాశ్రయాల్లో శంషాబాద్

చివరి నిమిషంలో ట్రావెల్ చేసే సాధారణ ప్రయాణీకులు అర్జెన్సీ కారణంగా వస్తారని, అలాంటి వారు టిక్కెట్ కోసం ఎక్కువ ప్రైస్ చెల్లిస్తున్నారని, ఇలాంటి అధిక ధరలు ప్రతిబంధకంగా మారాయని ఎయిరిండియా అధికార ప్రతినిధి తెలిపారు.
ప్రస్తుతం తాము ప్రకటించిన డిస్కౌంట్ రేపటి నుంచి (11 మే) నుంచి అమలులోకి వస్తుందని తెలిపింది. సాధారణంగా చివరి నిమిషంలో టిక్కెట్ కొనుగోలు చేసే వారికి 40 శాతం నుంచి అంతకంటే ఎక్కువ రేట్లు ఉంటాయి. జెట్ ఎయిర్వేస్ సంక్షోభం, పలు విమానాల రద్దు తదితర పరిణామాల నేపథ్యంలో ఎయిరిండియా ఈ ఆఫర్ ప్రకటించింది. అందుబాటులో ఉన్న సీట్లలో లాస్ట్ మినట్లో బుకింగ్‌లపై దాదాపు యాభై శాతం తగ్గింపు వర్తింప చేయనుంది. ప్రయాణానికి మూడు గంటలలోపు బుక్ చేసుకుంటే ఈ తగ్గింపు వర్తిస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com