సౌదీ అరేబియా: రెండు ఆయిల్ నౌకలపై దాడి
- May 13, 2019
సౌదీ అరేబియా:సౌదీ అరేబియాకు చెందిన రెండు ఆయిల్ నౌకలపై గర్తుతెలియని ముష్కరులు దాడిచేశారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) తీరానికి సమీపంలో ఈ నౌకలపై భీకర దాడి జరిగిందని సౌదీ ఇంధన శాఖ మంత్రి ఖలీద్ అల్ ఫలీహ్ తెలిపారు. ఈ ఘటన జరిగినప్పుడు రెండు ట్యాంకర్లలో ముడిచమురు నిండుగా ఉందని చెప్పారు. తమ నౌకలు అరేబియన్ గల్ఫ్ దాటుతున్న క్రమంలో ఈ దాడి జరిగిందనీ, తమ నౌకలు బాగానే దెబ్బతిన్నాయని అన్నారు. అయితే అదృష్టవశాత్తూ ఆయిల్ సముద్రంలోకి ఒలకలేదని వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ నౌకాయానం స్వేచ్ఛగా సాగాల్సిన అవసరముందని, ఇందుకు ప్రపంచదేశాలన్నీ కలసి రావాలని పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- భారతీయ జర్నలిస్టులకు పులిట్జర్ అవార్డు
- అనధికార అబార్షన్ ప్రమోటింగ్..ప్రవాసికి ఆరు నెలల జైలు, SR 100,000 ఫైన్..!!
- యుద్ధం, ప్రాంతీయ ఉద్రిక్తతల పై కింగ్ హమద్, జెలెన్స్కీ చర్చలు..!!
- యూఏఈలో Dh1.046 బిలియన్లతో కొత్త డీశాలినేషన్ స్టేషన్..!!
- ప్రాంతీయ పరిణామాల పై బ్రిటిష్, కువైట్ తో ఒమన్ చర్చలు..!!
- మే 13 నుండి 16 వరకు ఓల్డ్ దోహా పోర్టులో పిషింగ్ పోటీ..!!
- విమాన సర్వీసుల పై భారత్, కువైట్ చర్చలు..!!
- IPL 2026: ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- హైడ్రా కమిషనర్ మాట మార్చిన కారణం ఏంటి: దాసోజు శ్రావణ్
- అంతర్జాతీయ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు...10 మంది అరెస్ట్









