సౌదీ అరేబియా: రెండు ఆయిల్ నౌకలపై దాడి
- May 13, 2019
సౌదీ అరేబియా:సౌదీ అరేబియాకు చెందిన రెండు ఆయిల్ నౌకలపై గర్తుతెలియని ముష్కరులు దాడిచేశారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) తీరానికి సమీపంలో ఈ నౌకలపై భీకర దాడి జరిగిందని సౌదీ ఇంధన శాఖ మంత్రి ఖలీద్ అల్ ఫలీహ్ తెలిపారు. ఈ ఘటన జరిగినప్పుడు రెండు ట్యాంకర్లలో ముడిచమురు నిండుగా ఉందని చెప్పారు. తమ నౌకలు అరేబియన్ గల్ఫ్ దాటుతున్న క్రమంలో ఈ దాడి జరిగిందనీ, తమ నౌకలు బాగానే దెబ్బతిన్నాయని అన్నారు. అయితే అదృష్టవశాత్తూ ఆయిల్ సముద్రంలోకి ఒలకలేదని వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ నౌకాయానం స్వేచ్ఛగా సాగాల్సిన అవసరముందని, ఇందుకు ప్రపంచదేశాలన్నీ కలసి రావాలని పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు.. ప్రజలకు అధికారుల కీలక సూచనలు
- ఇరాన్ దాడులు, హోర్ముజ్ జలసంధి భద్రత పై చర్చించిన బహ్రెయిన్ రాజు–ఈజిప్ట్ అధ్యక్షుడు
- సురక్షిత సమాజం కోసం మహిళలతో చేతులు కలిపిన మల్కాజిగిరి పోలీసులు
- దుబాయ్ పోలీస్లో నాలుగో విడత 'సేఫ్టీ అంబాసిడర్స్' కార్యక్రమం ప్రారంభం
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడి యత్నం.. శత్రు దాడులను తిప్పికొట్టిన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఇరాన్కు గూఢచర్యం చేసిన ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన బహ్రెయిన్
- ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ తో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక భేటీ...
- లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీకి కువైట్ తొలి 15 ఏళ్ల గోల్డెన్ రెసిడెన్సీ
- ఢిల్లీ నుంచి తెలంగాణకు రోడ్ మ్యాప్..
- ముద్రగడ పద్మనాభం కన్నుమూత







