400 మంది లేబరర్స్‌కి ఫుడ్‌ ప్యాకెట్స్‌ పంచిన బోహ్రా కమ్యూనిటీ

- May 13, 2019 , by Maagulf
400 మంది లేబరర్స్‌కి ఫుడ్‌ ప్యాకెట్స్‌ పంచిన బోహ్రా కమ్యూనిటీ

బహ్రెయిన్:బోహ్రా కమ్యూనిటీగా పిలవబడ్తున్న జమెయత్‌ ఉల్‌ బోహ్రా ఇస్లామియా, కింగ్‌డమ్‌లో 400 మంది లేబరర్స్‌కి ఫుడ్‌ ప్యాకెట్స్‌ని పంపిణీ చేసింది. రైస్‌, పల్సస్‌, మిల్క్‌ పౌడర్‌, టీ బ్యాగ్స్‌, షుగర్‌, సాల్ట్‌, స్పైసెస్‌, ఆయిల్‌ బాటిల్స్‌ ఈ ప్యాకెట్స్‌లో వుంటాయి. మూడు ల్యాబర్‌ క్యాంప్‌లలో ఈ ప్యాకెట్స్‌ని పంపిణీ చేయడం జరిగింది. కమ్యూనిటీ మెంబర్స్‌ ఈ ఫుడ్‌ ప్యాకెట్స్‌ని పంపిణీ చేశారనీ, సిట్రాలోని మూడు క్యాంప్‌లలో వీటిని పంచడం జరిగిందని దానా కమిటీ కోఆర్డినేటర్‌ దావూద్‌ ఫక్రుద్దీన్‌ చెప్పారు. ఎక్సెస్‌ ఫుడ్‌ నుంచి జీరో వేస్టేజ్‌ అనే నినాదంతో దానా కమిటీ - ఫుడ్‌ గ్రెయిన్‌ కమిటీ సబ్‌ సెక్షన్‌గా సేవలు అందిస్తోంది.ప్రపంచ వ్యాప్తంగా దావూదీ బోహ్రా కమిటీ 'ప్రాజెక్ట్‌ రైజ్‌' పేరుతో ఫిలాంత్రోపిక్‌ ఇనీషియేటివ్‌ నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com