డిగ్రీ అర్హతతో ‘ఈపీఎఫ్వో’లో ఉద్యోగాలు..
- May 22, 2019
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్వో) అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. మే 30 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అవుతుంది. అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో జూన్ 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రిలిమ్స్, మెయిన్స్ రాత పరీక్షల ద్వారా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది.
పోస్టులు: 280……….. జనరల్ : 113 ఈడ్ల్యూఎస్: 28 ఎస్సీ: 42 ఎస్టీ: 21 ఓబీసీ (ఎన్సీఎల్): 76. 11 పోస్టులను దివ్యాంగులకు కేటాయించారు.
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు: 25.06.2019 నాటికి 20 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, మహిళలు, దివ్యాంగులు, డిపార్ట్మెంటల్ అభ్యర్థులు రూ.250 చెల్లిస్తే సరిపోతుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా ఎంపిక: ప్రిలిమ్స్, మెయిన్స్ ద్వారా జీతం: రూ.44,900. ఇతర అలవెన్సులు అదనం
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం 30.05.2019 ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 25.06.2019 ప్రిలిమినరీ పరీక్ష: జులై 30, 31 తేదీల్లో
మెయిన్స్ : ప్రిలిమినరీ రిజల్ట్ వచ్చిన తరువాత ప్రకటిస్తారు.
తాజా వార్తలు
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!
- అల్-వాఫ్రాలో అగ్నిప్రమాదం..!!
- ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి.కుమారస్వామికి సీఎం రేవంత్ రెడ్డి వినతి
- ఏపీలో అత్యవసర వైద్య సేవల్లో కొత్త శకం
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2 శాతం డీఏ పెంపు
- ఏప్రిల్ 20 నుంచి యూఏఈలో స్కూల్ బస్ సర్వీసులు పునఃప్రారంభం









