పర్మనెంట్ రెసిడెన్సీ గోల్డ్ కార్డ్ ప్రక్రియను ప్రారంభించిన యూఏఈ
- May 22, 2019
యూఏఈ:ఎంపిక చేసిన వ్యక్తులకు పర్మనెంట్ రెసిడెన్సీ డాక్యుమెంట్స్ అందించే ప్రక్రియను యూఏఈ ప్రారంభించింది. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ మరియు ఫారిన్ ఎఫైర్స్ ఇన్ దుబాయ్ (జిడిఆర్ఎఫ్ఎ) డైరెక్టర్ జనరల్ జనరల్ మొహమ్మద్ అహ్మద్ అల్ మర్రి మాట్లాడుతూ, దుబాయ్ రూలర్, యూఏఈ ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ సూచనల మేరకు పర్మనెంట్ రెసిడెన్సీ కార్డుల జారీ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభించినట్లు తెలిపారు. ఇంటర్నేషనల్ ఎకానమీ మ్యాప్లో ఈ 'గోల్డెన్ కార్డ్' యూఏఈని మరో మెట్టు పైకెక్కిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేలా ఎప్పటికప్పుడు సరికొత్త నిర్ణయాలు తీసుకోవడంలో యూఏఈ ఎప్పుడూ ముందుంటుందని చెప్పారాయన. 70 దేశాలకు చెందిన 6,800 మంది వలసదారులకు పర్మనెంట్ రెసిడెన్సీ గోల్డెన్ కార్డ్ అందించనున్నట్లు వివరించారు జనరల్ మొహమ్మద్ అహ్మద్ అల్ మర్రి.
తాజా వార్తలు
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!
- అల్-వాఫ్రాలో అగ్నిప్రమాదం..!!
- ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి.కుమారస్వామికి సీఎం రేవంత్ రెడ్డి వినతి
- ఏపీలో అత్యవసర వైద్య సేవల్లో కొత్త శకం
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2 శాతం డీఏ పెంపు
- ఏప్రిల్ 20 నుంచి యూఏఈలో స్కూల్ బస్ సర్వీసులు పునఃప్రారంభం









