మక్కా, జెడ్డాపై మిస్సైల్ దాడిని ఖండించిన బహ్రెయిన్
- May 22, 2019యెమెన్కి చెందిన తీవ్రవాదులు సౌదీ అరేబియాలోని మక్కా మరియు జెడ్డాపై దాడి కోసం మిస్సైల్స్ ప్రయోగించడాన్ని బహ్రెయిన్ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఫారిన్ మినిస్ట్రీ ఓ ప్రకటన విడుదల చేసింది. తీవ్రవాదం ఏ రూపంలో వున్నా దాన్ని సమర్థించకూడదని, ప్రపంచమంతా ఏకమై తీవ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాల్సి వుందని బహ్రెయిన్ పేర్కొంది. అత్యంత చాకచక్యంగా మిస్సైల్స్ని డిస్ట్రాయ్ చేసిన సౌదీ ఎయిర్ డిఫెన్స్ ఫోర్సెస్ని ఈ సందర్భంగా బహ్రెయిన్ అభినందించింది. సౌదీ అరేబియాకి బహ్రెయిన్ అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుందనీ, ఇస్లామిక్ సమాజం అంతా ఈ విషయమై ఒక్కతాటిపైకి రావాలని బహ్రెయిన్ పిలుపునిచ్చింది. తైఫ్ మీదుగా వస్తున్న మిస్సైల్స్ని సౌదీ డిఫెన్స్ ఫోర్సెస్ ధ్వంసం చేశాయి. మిస్సైల్ శకలాలు వాడి జలీల్లో కూలిపోయాయి. కాగా, యెమనీ ప్రభుత్వం కూడా ఈ దాడుల్ని ఖండించింది. పవిత్ర నగరాలపై దాడులకు దిగడం ద్వారా తీవ్రవాదులు తమ హీనత్వాన్ని చాటుకున్నారని యెమెన్ వ్యాఖ్యానించింది.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్