బస్సు ప్రమాదంలో 19 మందికి గాయాలు

- May 22, 2019 , by Maagulf
బస్సు ప్రమాదంలో 19 మందికి గాయాలు

మస్కట్‌:అల్‌ అమెరాత్‌ హిల్‌ ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 19 మందికి గాయాలయ్యాయి. ఈ విషయాన్ని రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ వెల్లడించింది. రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ మరియు పబ్లిక్‌ అథారిటీ ఫర్‌ సివిల్‌ డిఫెన్స్‌ అండ్‌ అంబులెన్స్‌ సంఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టాయి. ఈ సందర్భంగా రాయల్‌ ఒమన్‌ పోలీస్‌, ఓ ప్రకటన విడుదల చేయడం జరిగింది. 8 మందికి ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలు కాగా, ఒకరికి ఓ మోస్తరు గాయాలయ్యాయి. 10 మందికి చిన్న చిన్న గాయాలు మాత్రమే అయ్యాయి. గాయపడ్డవారికి ప్రాథమిక వైద్య చికిత్స అందించి అనంతరం ఆసుపత్రికి తరలించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com