బస్సు ప్రమాదంలో 19 మందికి గాయాలు
- May 22, 2019మస్కట్:అల్ అమెరాత్ హిల్ ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 19 మందికి గాయాలయ్యాయి. ఈ విషయాన్ని రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించింది. రాయల్ ఒమన్ పోలీస్ మరియు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ సంఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టాయి. ఈ సందర్భంగా రాయల్ ఒమన్ పోలీస్, ఓ ప్రకటన విడుదల చేయడం జరిగింది. 8 మందికి ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలు కాగా, ఒకరికి ఓ మోస్తరు గాయాలయ్యాయి. 10 మందికి చిన్న చిన్న గాయాలు మాత్రమే అయ్యాయి. గాయపడ్డవారికి ప్రాథమిక వైద్య చికిత్స అందించి అనంతరం ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు