హవాలా కేసులో ఇండియన్ ప్రిన్సిపల్ అరెస్ట్
- May 24, 2019
కువైట్: హవాలా కుంభకోణానికి సంబంధించి ఇండియాలో ఓ ముస్లిం క్లరిక్ మరియు బిజినెస్ మేన్ని అరెస్ట్ చేశారు. 8,45,000 రూపాయల్ని కువైట్ నుంచి పంపినట్లుగా నిందితుడిపై అభియోగాలు మోపబడ్డాయి. బార్పేటలోని జామియా ఇస్లామియా సలాఫియా అరబిక్ కాలేజ్ ప్రిన్సిపల్గా పనిచేస్తున్నారు నురుల్ ఇస్లామ్. అతని నుంచి డబ్బుని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విచారణ సందర్భంగా నిందితుడు తనకు ఆ సొమ్ము కువైట్ నుంచి వచ్చినట్లు అంగీకరించాడని పోలీసులు తెలిపారు. పోలీసులు ఈ కేసులో బిజినెస్ మేన్ ఆరోన్ సార్ఫ్ని కూడా అరెస్ట్ చేశారు. హవాలా డీల్కి అరోన్ సహాయ సహకారాలు అందిస్తారు. నురుల్ ఇస్లామ్ గతంలో 28,00,000 రూపాయల్ని యూనివర్సిటీ బ్యాంకింగ్ అకౌంట్లో మూడు సెపరేట్ ట్రాన్సాక్షన్స్ రూపంలో డిపాజిట్ చేసినట్లు గుర్తించారు. అనైతిక కార్యకలాపాల కోసం నిందితుడు ఈ డబ్బుని వినియోగించి వుంటాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అండర్గ్రౌండ్ నెట్వర్క్ ద్వారా హవాలా సిస్టమ్ నడుస్తుంటుంది.
తాజా వార్తలు
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!







