హవాలా కేసులో ఇండియన్ ప్రిన్సిపల్ అరెస్ట్
- May 24, 2019కువైట్: హవాలా కుంభకోణానికి సంబంధించి ఇండియాలో ఓ ముస్లిం క్లరిక్ మరియు బిజినెస్ మేన్ని అరెస్ట్ చేశారు. 8,45,000 రూపాయల్ని కువైట్ నుంచి పంపినట్లుగా నిందితుడిపై అభియోగాలు మోపబడ్డాయి. బార్పేటలోని జామియా ఇస్లామియా సలాఫియా అరబిక్ కాలేజ్ ప్రిన్సిపల్గా పనిచేస్తున్నారు నురుల్ ఇస్లామ్. అతని నుంచి డబ్బుని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విచారణ సందర్భంగా నిందితుడు తనకు ఆ సొమ్ము కువైట్ నుంచి వచ్చినట్లు అంగీకరించాడని పోలీసులు తెలిపారు. పోలీసులు ఈ కేసులో బిజినెస్ మేన్ ఆరోన్ సార్ఫ్ని కూడా అరెస్ట్ చేశారు. హవాలా డీల్కి అరోన్ సహాయ సహకారాలు అందిస్తారు. నురుల్ ఇస్లామ్ గతంలో 28,00,000 రూపాయల్ని యూనివర్సిటీ బ్యాంకింగ్ అకౌంట్లో మూడు సెపరేట్ ట్రాన్సాక్షన్స్ రూపంలో డిపాజిట్ చేసినట్లు గుర్తించారు. అనైతిక కార్యకలాపాల కోసం నిందితుడు ఈ డబ్బుని వినియోగించి వుంటాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అండర్గ్రౌండ్ నెట్వర్క్ ద్వారా హవాలా సిస్టమ్ నడుస్తుంటుంది.
తాజా వార్తలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు
- కువైట్లో బ్యాచిలర్లకు కొత్త కష్టాలు..!
- QR247 మిలియన్లు తిరిగి చెల్లించాలని సీఈఓను ఆదేశించిన కోర్టు
- 2023లో 99%కి చేరుకున్న సౌదీ ఇంటర్నెట్ వినియోగం
- మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం.. అగ్రస్థానంలో భారతీయులు
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ సీజన్..మరో 3 రోజులు పొడిగింపు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం