భానుడి భగభగలు..భగ్గుమంటున్న తెలుగు రాష్ట్రాలు
- May 26, 2019
ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణ రాష్ట్రం నిప్పుల కుంపటిలా మారింది. ఈ వేసవిలో రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మాడు పగిలిపోయేలా ఎండల తీవ్రత ఉంటోంది. ఎండల తీవ్రతకు వేడిగాలులు తోడయ్యాయి. వేడిగాలులు ప్రాణాలు తీస్తున్నాయి. శనివారం (మే 25,2019) హైదరబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మాదాపూర్ లో రికార్డ్ స్థాయిలో టెంపరేచర్లు నమోదయ్యాయి. 44.1 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డ్ అయ్యింది. పాశమైలారంలో 43.5, ఖైరతాబాద్ లో 43.2, బేగంపేటలో 42.2, అంబర్ పేట్ లో 43.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మాదాపూర్ లో ఈ స్థాయిలో ఎండల తీవ్రత పెరగడం ఇదే తొలిసారి. పగటి ఉష్ణోగ్రతలు అమాంతం పెరుగుతున్నాయి. ఆదివారం (మే 26,2019) ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.
మాడు పగిలే ఎండలు, వడగాలులతో ఇళ్ల నుంచి బయటకు వచ్చే సాహసం చెయ్యడం లేదు. మధ్యాహ్నానికి రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. పనులకు వెళ్లే రైతులు, కూలీలు వడదెబ్బతో ఆస్పత్రులపాలవుతున్నారు. రాగల మూడు రోజులు రాష్ట్రంలో ఎండలు, వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు చెప్పారు. అత్యవసరం అయితే తప్ప ప్రజలు సాయంత్రం వరకు రోడ్ల మీదకు రాకపోవడమే మంచిదంటున్నారు. బాలింతలు, పిల్లలు, వృద్ధులు వడదెబ్బ బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచించారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







