మోదీ పర్యటనపై మాల్దీవుల మీడియా ప్రకటన
- May 27, 2019
భారీ ఆధిక్యతతో రెండోసారి ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న నరేంద్ర మోదీ తొలి విదేశీ పర్యటన ఖరారైంది. ఆయన వచ్చే వారం మాల్దీవులకు వెళ్ళబోతున్నట్లు తెలుస్తోంది. రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఆయన పాల్గొనే తొలి ద్వైపాక్షిక సమావేశం ఇదే. జూన్ 7, 8 తేదీల్లో ఆయన మాల్దీవుల్లో పర్యటిస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
మోదీ పర్యటన గురించి మాల్దీవుల మీడియా కూడా ప్రకటించింది. మాల్దీవుల అధ్యక్షుడు ఇబ్రహీం మహమ్మద్ సోలిహ్ ఈ నెల 23న లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత మోదీకి ఫోన్ చేసి, అభినందనలు తెలిపారు. సోలిహ్ 2018 నవంబరులో దేశాధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మోదీ హాజరయ్యారు. 2014లో మొదటిసారి ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మోదీ అదే ఏడాది జూన్లో తొలి విదేశీ పర్యటన జరిపారు. ఆయన ముందుగా భూటాన్ వెళ్ళారు.
తాజా వార్తలు
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు







