మోదీ పర్యటనపై మాల్దీవుల మీడియా ప్రకటన
- May 27, 2019భారీ ఆధిక్యతతో రెండోసారి ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న నరేంద్ర మోదీ తొలి విదేశీ పర్యటన ఖరారైంది. ఆయన వచ్చే వారం మాల్దీవులకు వెళ్ళబోతున్నట్లు తెలుస్తోంది. రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఆయన పాల్గొనే తొలి ద్వైపాక్షిక సమావేశం ఇదే. జూన్ 7, 8 తేదీల్లో ఆయన మాల్దీవుల్లో పర్యటిస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
మోదీ పర్యటన గురించి మాల్దీవుల మీడియా కూడా ప్రకటించింది. మాల్దీవుల అధ్యక్షుడు ఇబ్రహీం మహమ్మద్ సోలిహ్ ఈ నెల 23న లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత మోదీకి ఫోన్ చేసి, అభినందనలు తెలిపారు. సోలిహ్ 2018 నవంబరులో దేశాధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మోదీ హాజరయ్యారు. 2014లో మొదటిసారి ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మోదీ అదే ఏడాది జూన్లో తొలి విదేశీ పర్యటన జరిపారు. ఆయన ముందుగా భూటాన్ వెళ్ళారు.
తాజా వార్తలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం
- టీడీపీ అభ్యర్థి టీ.జీ.భరత్ నామినేషన్ దాఖలు
- ఏపీకి ప్రధాని మోదీ..సభలు, రోడ్ షోల షెడ్యూల్ ఇదే