ఎస్పీకి 'స్వరకళాసామ్రాట్' బిరుదు..
- January 02, 2016
విశాఖ కేంద్రంగా విశాఖ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రెండో రోజు కార్యక్రమాల్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంను సన్మానించారు. ఎస్పీకి స్వరకళాసామ్రాట్ బిరుదు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ తెలుగుజాతికి కీర్తి తెచ్చిన వ్యక్తి ఎస్పీ అని కొనియాడారు. బాలసుబ్రహ్మణ్యం ఎందరో గాయకులను వెలుగులోకి తెచ్చారని అన్నారు. 50 ఏళ్ల పాటు ఎలాంటి పోటీ లేకుండా ఆయన రాణించారని పేర్కొన్నారు. విశాఖ భారత్లోనే కాకుండా అంతర్జాతీయంగా కూడ ప్రముఖ పర్యాటక కేంద్రంగా వర్ధిల్లుతోందని చంద్రబాబు అన్నారు. విశాఖ ఉత్సవ్లో ఏర్పాటు చేసిన పుష్ప ప్రదర్శన, తొమ్మిది దేవాలయాల నమూనాల ప్రాంగణం అద్భుతంగా ఉన్నాయంటూ కొనియాడారు. ఈ కార్యక్రమంలో మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు, పల్లెరఘునాథ్రెడ్డి, సంగీత దర్శకుడు కీరవాణి, తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







