ఎస్పీకి 'స్వరకళాసామ్రాట్' బిరుదు..
- January 02, 2016
విశాఖ కేంద్రంగా విశాఖ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రెండో రోజు కార్యక్రమాల్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంను సన్మానించారు. ఎస్పీకి స్వరకళాసామ్రాట్ బిరుదు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ తెలుగుజాతికి కీర్తి తెచ్చిన వ్యక్తి ఎస్పీ అని కొనియాడారు. బాలసుబ్రహ్మణ్యం ఎందరో గాయకులను వెలుగులోకి తెచ్చారని అన్నారు. 50 ఏళ్ల పాటు ఎలాంటి పోటీ లేకుండా ఆయన రాణించారని పేర్కొన్నారు. విశాఖ భారత్లోనే కాకుండా అంతర్జాతీయంగా కూడ ప్రముఖ పర్యాటక కేంద్రంగా వర్ధిల్లుతోందని చంద్రబాబు అన్నారు. విశాఖ ఉత్సవ్లో ఏర్పాటు చేసిన పుష్ప ప్రదర్శన, తొమ్మిది దేవాలయాల నమూనాల ప్రాంగణం అద్భుతంగా ఉన్నాయంటూ కొనియాడారు. ఈ కార్యక్రమంలో మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు, పల్లెరఘునాథ్రెడ్డి, సంగీత దర్శకుడు కీరవాణి, తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









